NTV Telugu Site icon

CM Chandrababu Naidu: రేపు తాడిగడపకు సీఎం చంద్రబాబు..

Babu

Babu

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.. పెనమలూరు మండలం తాడిగడపలో నిర్వహించనున్న రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొననున్నారు.. పెనమలూరు మండలంలోని తాడిగడప.. రామోజీరావు స్వగ్రామం అయిన విషయం విదితమే.. క్రమంగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించినా.. ఏ నాడూ సొంత ఊరిని మరవకుండా.. అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు రామోజీరావు.. ఇక, తాడిగడపలో నిర్వహించే రామోజీ రావు సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. రామోజీతో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోనున్నారు.. మరోవైపు.. రేపటి సభా ఏర్పాట్లను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, సత్యాకుమార్ యాదవ్‌, కొలుసు పార్థసారథి పరిశీలించారు.. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన దాదాపు 7 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు మంత్రి పార్థసారథి వెల్లడించారు.. ఇక, రామోజీరావు పుట్టిన జిల్లాల్లో తాను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు మంత్రి పార్థసారథి. ఇక, దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.. మీడియా, సినీ రంగాలతో పాటు సమాజానికి ఆయన చేసిన విశేష సేవలకుగాను ఆయన గౌరవార్థం సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

Read Also: Deputy CM Pawan Kalyan: ఉన్నది రూ.7 కోట్లేనన్న అధికారులు.. ఆశ్చర్యపోయిన డిప్యూటీ సీఎం పవన్..