CM Chandrababu : అందుకే ప్రధాని చేతుల మీదుగా రాజధాని పనులు పున:ప్రారంభించాం..
- కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం మీటింగ్
- రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై హర్షం
- ప్రధాని మోడీ వ్యాఖ్యలను గుర్తు చేసిన సీఎం చంద్రబాబు
- ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందన్న సీఎం
- కార్యక్రమంపై అభిప్రాయాలు పంచుకున్న మంత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు. సమన్వయంతో పని చేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు చెప్పారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి పీఎంను ఆహ్వానించడానికి గల కారణాన్ని సీఎం చెప్పారు.
READ MORE: IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు ఇవే.. షెపర్డ్ స్థానం ఎంతంటే?
Also Read
“అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమైంది. అమరావతి ఆవశ్యకతను వివరించేందుకే ప్రధాని చేతుల మీదుగా పనులు పున:ప్రారంభించాం. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయి. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయి. నిన్నటి సభతో అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. దేశానికి అమరావతి రోల్ మోడల్గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వ కారణం. ప్రధాని మోడీ ప్రసంగం ప్రజల పట్ల ఉన్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది. మంత్రులు, నేతలకు అప్పగించిన పనులను బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా పని చేశారు. లక్షల మంది ప్రజలు పోటెత్తినా ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా, పాజిటివ్ దృక్పధంతో కార్యక్రమం జరిగింది.” అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
READ MORE: Off The Record: వైసీపీలోకి తిరిగి వెళ్లడానికి ఇగో అడ్డొస్తుందన్న నేత ఎవరు? ఏంటా పరిస్థితి?
సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా మంత్రులు పార్థసారధి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, నారాయణ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?