CM Chandrababu Naidu: ఆనాడు శపథం.. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు..
- రెండేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు
- తనను అన్ని రకాలుగా అవమానించిన ఈ సభలో విపక్ష నేతగా ఉండలేను అంటూ 2021లో సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు
- రెండేళ్ల తర్వాత సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు
- తొలుత శాసన సభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: రెండేళ్ల క్రితం శపథం చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్లిపోయిన అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో రెండేళ్ల తర్వాత అదే సభలో అడుగుపెట్టారు.. ఈ సందర్భంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.. తనను అన్ని రకాలుగా అవమానించిన ఈ సభలో విపక్ష నేతగా ఈ కౌరవ సభలో ఉండలేను.. మళ్లీ గెలిచి గౌరవ సభలో అడుగుపెడతానంటూ 2021లో సభ నుంచి వెళ్లిపోయిన ఆయన.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. శాసనసభకు చేరుకున్నారు.. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.. ఇక, తొలుత శాసన సభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.. ఆ తర్వాత శాసన సభలో అడుగుపెట్టారు చంద్రబాబు.
అయితే, 2021 నవంబర్ 19వ తేదీ తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.. ఇన్నేళ్లు తాను పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ.. ఇలాంటి సభలో నేనుండను.. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను.. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు.. మీ అందరికీ ఓ నమస్కారం.. అంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు చంద్రబాబు.. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. ఆయన సమావేశాలకు వెళ్లింది లేదు.. కానీ, ప్రజాక్షేత్రంలో వైసీపీపై పోరాటం చేస్తూనే వచ్చారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-బీజేపీతో కలిసి పోటీ అఖండ విజయాన్ని అందుకున్నారు.. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లోనూ కీలకంగా మారారు.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
Also Read
- Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
- Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
తాజావార్తలు
-
Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
-
Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
-
Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
-
Nissan Tecton: నిస్సాన్ టెక్టన్ SUV భారత్లో లాంచ్.. క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!