Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
- ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బిజీబిజీ
- అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు
- సీఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొననున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న సీఎం.. పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహకారం వంటి అంశాలపై ఈ భేటీల్లో చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, జలవనరుల అభివృద్ధి, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సహాయంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర భద్రత, పరిపాలన, అభివృద్ధి అంశాలపై కూడా అమిత్ షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థిక సహకారం, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు మద్దతుతో అమలు చేయదగిన పలు ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్లో నిర్వహించే సీఐఐ బిజినెస్ సమ్మిట్లో సీఎం పాల్గొననున్నారు. దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై సీఎం ప్రసంగించనున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తారని అధికారులు చెబుతున్నారు.
Also Read
- Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్తో బరిలోకి..
- Earthquake: చైనా, జపాన్లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- Mission Godavari Clean Project: మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం
ఇక ఈరోజు రాత్రి ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు గౌహతి (అస్సాం)కు బయల్దేరనున్నారు. అక్కడ జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి కీలకంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్తో బరిలోకి..
-
Earthquake: చైనా, జపాన్లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
-
Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
-
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్లో భారత సంతతి ఆటగాడి రికార్డ్..
-
Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?