Road Accident: వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!
- గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
- వ్యవసాయ కూలీల మృతిపై సీఎం చంద్రబాబు విచారం
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
రైతు కూలీలతో వెళుతున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మహిళలు మృతి చెందటం బాధాకరమన్నారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ‘కూలీ పనులకోసం వెళ్తున్న మహిళలు ప్రాణాలు కోల్పోవడం భాదాకరం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్ర కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం. బుడంపాడు-బాపట్ల రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. బుడంపాడు రోడ్డును బాపట్ల సమీపంలో జాతీయ రహదారి 214కు అనుసంధానం చేయాల్సిన ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. ప్రతి నిత్యం 22 వేల భారీ వాహనాలు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నాయి. జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపాము, కేంద్రం వద్ద పెన్డింగ్లో ఉన్నాయి. కేంద్ర మంత్రి సహకారంతో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం’ అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల చెప్పారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!