Road Accident: వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!
- గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
- వ్యవసాయ కూలీల మృతిపై సీఎం చంద్రబాబు విచారం
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
రైతు కూలీలతో వెళుతున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మహిళలు మృతి చెందటం బాధాకరమన్నారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ‘కూలీ పనులకోసం వెళ్తున్న మహిళలు ప్రాణాలు కోల్పోవడం భాదాకరం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్ర కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం. బుడంపాడు-బాపట్ల రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. బుడంపాడు రోడ్డును బాపట్ల సమీపంలో జాతీయ రహదారి 214కు అనుసంధానం చేయాల్సిన ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. ప్రతి నిత్యం 22 వేల భారీ వాహనాలు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నాయి. జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపాము, కేంద్రం వద్ద పెన్డింగ్లో ఉన్నాయి. కేంద్ర మంత్రి సహకారంతో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం’ అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల చెప్పారు.
Also Read
- AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.
తాజావార్తలు
-
AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!