CM Chandrababu : విశాఖను దోచేసిన దొంగలను వదిలే ప్రసక్తే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం దార్లపూడి పోలవరం కెనాల్ దగ్గర ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. నార్త్ కొరియా లో నవ్వినా, ఏడ్చినా కొట్టే కిమ్ లాంటి జిమ్ మన రాష్ట్రంలో ఉన్నాడన్నారు. మనకు ఆర్థిక వెసులు బాటు కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏపై ఉందన్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ ను నేను ఒప్పుకున్నామని చెబుతున్నారన్నారు. గతంలో వాజపేయి హయాంలో ప్రైవేటీకరణ చేస్తాన్నప్పుడు అడ్డుకున్నాం, ఈ సారీ కాపడుతామని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ను దోచేసిన దొంగలను వదిలే ప్రసక్తే లేదన సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా సేవకులు గా వచ్చాం వచ్చే పర్యటన నుంచి నా పర్యటనలో గ్రీన్ కార్పెట్ కూడా వేయొద్దు అన్నారు చంద్రబాబు. కార్పెట్ వేస్తె వాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో గోదావరి జిల్లాల తర్వాత అత్యధిక ఓట్లు, మెజారిటీ వచ్చింది ఉత్తరాంధ్ర నుంచే అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’రాక్షస పాలనను అంతమొందించి మమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని నిలబెట్టె బాధ్యత నాది. ఐదేళ్ల ముందు ఎలాంటి పనులు చేశామో అలానే ఉన్నాయ్. సుజల స్రవంతి నీ పూర్తి చేసుకుని గోదావరి నీళ్లు తెచ్చుకుంటే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. దార్లపూడి అక్విడిక్ట్, అండర్ పాస్ కోసం ఈరోజే టెండర్లు పిలవాలని ఆదేశిస్తున్నా. వీలైనంత త్వరలో సుజల స్రవంతి నీ పూర్తి చేస్తాం. 800 కోట్లు ఖర్చు పెడితే 2.20 లక్షల ఎకరాలకు తాగునీరు ఇచ్చి జన్మ సార్థకం చేసుకుంటాం. వంశధార, గోదావరి, కృష్ణా , పెన్నా నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తాం. రైతులకు న్యాయం చేయడం ఎన్ డీ ఏ ప్రభుత్వ లక్ష్యం. పోలవరం, అమరావతి, కుప్పం తర్వాత ఢిల్లీ వెళ్లి ఆర్థిక పరిస్థితులపై చర్చించి తర్వాత మొదటగా ఉత్తరాంధ్ర కు వచ్చా. ఎన్ డీ ఏ కు దేశంలో ఎక్కడా లేని ఘన విజయాన్ని రాష్ట్రంలో అందించారు. ఓట్లు వేశాం అని ఇంట్లో పడుకోకుండా దొంగ మాటలు చెప్పే వాళ్ళను తిరగనీయకుండా చూడండి.
వైఎస్ఆర్సీపీ చెప్పేవి అన్నీ అబద్ధాలే. మీ మనోభావాలకు అనుగుణంగా పాలన చేస్తాం. పెన్షన్ లను పెంచాం, మెగా డీ ఎస్ సీ ఇచ్చాం, ల్యాండ్ గ్రాబ్బింగ్ యాక్ట్ ను రద్దు. చేశాం. పెట్టుబడులు పెట్టే వాళ్ళు రాష్ట్రంలోని భూతం గురుంచి భయపడుతూ ఉన్నారు. ఆ భూతాన్ని నియంత్రించే భూత వైద్యులు ప్రజలే దాన్ని చూసుకుంటారు. రోడ్లపై ఉన్న గొయ్యల్లో వైఎస్ఆర్సీపీ నేతలను పూడ్చాలి. గొయ్యలపాలైన రాష్ట్రాన్ని ఏం చేయాలో తెలియడం లేదు.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
తాజావార్తలు
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!