Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Clp Leader Mallu Bhatti Vikramarka Peoples March Padayatra Is Close To A Thousand Kilometers

Bhatti Vikramarka: వెయ్యి కిలోమీటర్లకు చేరువైన ‘ పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్ర

Published Date :June 9, 2023 , 7:15 pm
By Sudhakar Ravula
Bhatti Vikramarka: వెయ్యి కిలోమీటర్లకు చేరువైన ‘ పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్ర
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhatti Vikramarka Peoples March Padayatra: ప్రతి ఇంటి గడప తాకుతూ.. ప్రతీ గుండెను పలకరిస్తూ.. మహిళలు, యువకులు, రైతులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, గొల్ల కురుమలు, చిరు వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వృద్ధులు.. అందరినీ కదిలిస్తూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ.. వారి ఆశీర్వాదం పొందుతూ.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ పట్టు వదలని విక్రమార్కుడిలా.. పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో ముందుకు సాగుతున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. గ్రామాలలో పండుగలా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కదులుతోంది.. పాలకులకు పాఠం నేర్పాలనే లక్ష్యంతోనే ప్రభంజనంతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగుతుంది అంటున్నారు విక్రమార్క.. నడకలో ఉత్సాహం నింపుతూ.. జనంతో మమేకమవుతూ.. సమస్యలు వింటూ.. పరిష్కార మార్గాలు చూపుతూ.. వచ్చేది మా ప్రభుత్వమే ఇక, మీ కష్టాలు అన్నీ తీరుస్తాం అని అభయం ఇస్తూ వడివడిగా అడుగులు వేస్తున్నారు.. ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వచ్చే నాలుగు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది ఇక చూస్కోండి అంటూ అంటూ వార్నింగ్‌ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

 

Whatsapp Image 2023 06 09 At 6.53.00 Pm (1)
ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలతో.. దశాబ్దాల పోరాటాల ఫలితంగా.. సోనియమ్మ సంకల్పంతో.. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నాం.. స్వేచ్ఛా, సమానత్వంతో, ప్రజాస్వామిక తెలంగాణ దిశగా పయనిద్దాం ! అని పిలుపునిస్తున్నారు.. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకు ఇస్తున్నా హామీలు ఇవే.. 2 లక్షల రైతు రుణమాఫీ, పంటకు మద్దతు ధర, ఇందిరమ్మ రైతు భరోసా, కర్మాగారాలు , పంటల బీమా పథకం & రైతు బీమా, ధరణీ పోర్టల్ రద్దు , నాణ్యమైన విత్తనాల సరఫరా , ప్రతి ఎకరాకు సాగు నీరు, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.. ఆశలు నెరవేర్చేందుకు.. ఆశయాలు సాధించేందుకే నా ఈ పయనం అంటున్నారు.. అడుగ‌డుగునా ప్రజ‌లతో మ‌మేకం అవుతూ.. జ‌న‌మే మ‌న‌మై.. మ‌న‌మే జ‌న‌మై అంటూ ముందుకు కదులుతున్నారు..

Whatsapp Image 2023 06 09 At 6.52.56 Pm

సీఎల్పీ నేత జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్రమార్క మార్చి 16న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర 85వ రోజు నాటికి 996 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ పాద‌యాత్రలో 500 పైగా గ్రామాలు.. తాండాలు, ప‌ల్లెలు, ప‌ట్టణాలు చుట్టేస్తూ ముందుకు సాగుతున్నారు.. గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్రజ‌లు.. భ‌ట్టి విక్రమార్కను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి విక్రమార్క పాద‌యాత్ర ముందుకు సాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్టడుగు, అణ‌గారిన వ‌ర్గాన‌లు పార్టీకి ద‌గ్గర చేయ‌డంలో భ‌ట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర విజ‌యం సాధించింది అంటున్నారు విశ్లేషకులు.. మార్చిన 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజరహాత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామం నుంచి పాద‌యాత్రను ప్రారంభించారు. ఇప్నటికే బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మపురి, పెద్దప‌ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధన్నపేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, అలేరు, భువ‌న‌గిరి, ఇబ్రహీంప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ న‌గ‌ర్, ప‌రిగి, జడ్చర్ల, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా పాద‌యాత్ర సాగించారు.. పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొందని చెబుతున్నారు..

Whatsapp Image 2023 06 09 At 6.52.57 Pm (1)

ప్రతీకూల పరిస్థితులు వచ్చినా వెనక్కి తగ్గడం లేకు భట్టి విక్రమార్క.. గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించని భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా మారారని చెబుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇప్పటికే పాదయాత్ర ముగియగా.. నల్గొండ జిల్లాలో అడుగుపెట్టారు. సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టనుంది భట్టి పాదయాత్ర.. ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.. ముగింపు సభకు లక్షల్లో ప్రజలు తరలివస్తారని అంచనావేస్తున్నారు..

Whatsapp Image 2023 06 09 At 6.52.58 Pm (1)

మార్చి 16న పాదయాత్ర పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభం కాగా.. మార్చి 22న ఆసిఫాబాద్ నియోజకవర్గం కేరి మేరి మండలం జరీ గ్రామంలో 125 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు.. ఏప్రిల్ 14న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు.. ఏప్రిల్ 16న 300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి బ్రిడ్జి పైన కేక్ కట్‌ చేసి ముందుకు సాగారు భట్టి.. ఏప్రిల్ 29 జనగామ జిల్లా నార్మెట్ట వద్ద 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి కాగా.. మే 25న మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్వేందర్ సింగ్ సుక్ ముఖ్య అథిధిగా హాజరయ్యారు.. ఇక, జూన్ 10న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతోంది.. ఈ సందర్భంగా దేవరకొండలో నిర్వహించే సభకు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రంజిత్ రంజన్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.. వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా గుమ్మడవెల్లిలో పైలాన్ ఆవిష్కరించనున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.

Whatsapp Image 2023 06 09 At 6.52.57 Pm

Whatsapp Image 2023 06 09 At 6.52.58 Pm

Whatsapp Image 2023 06 09 At 6.52.59 Pm

Whatsapp Image 2023 06 09 At 6.52.59 Pm (1)

Whatsapp Image 2023 06 09 At 6.53.00 Pm (2)

Whatsapp Image 2023 06 09 At 6.53.01 Pm

 

Whatsapp Image 2023 06 09 At 6.53.01 Pm (1)

 

Whatsapp Image 2023 06 09 At 6.53.02 Pm

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhatti Vikramarka Peoples March Padayatra
  • CLP Leader Mallu Bhatti Vikramarka
  • congress
  • mallu bhatti vikramarka
  • Peoples March Padayatra

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions