NTV Telugu Site icon

Bhatti Vikramarka : సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

Batti

Batti

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం పోలంప‌ల్లి గ్రామంలో పాద‌యాత్రలో లేఖ‌ను సీఎల్పీ నేత విడుద‌ల చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్చి 16 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. 18 రోజులుగా ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తొన్న నాకు వేల మంది గిరిజనులు, ఆదివాసీలు కలిసి వారు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు పట్టాల భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా హక్కులు కోల్పోయామని, తమ భూముల్లోకి రాకుండా అటవి అధికారులు పెడుతున్న ఇబ్బందులను చెప్పి కన్నీటి పర్యంతమయ్యారని లేఖలో పేర్కొన్నాడు.

Also Read : Janhvi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడితో తిరుపతిలో కనిపించిన జాన్వీ…

ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, న‌ల్గొండ తదిత‌ర జిల్లాల్లో పోడు చేసుకుంటున్న రైతుల‌కు తక్షణమే ప‌ట్టాలు పంపిణీ చేయాలి.. పోడు ప‌ట్టాల‌పై 2014 నుంచి మీరు, మీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటలన్నీ నీటిమీద రాతలుగా మారాయని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో తెలిపాడు. పోడు భూముల సమస్యలను 2014, 2018 సాధార‌ణ‌, నాగార్జున సాగ‌ర్‌, మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో మీరు అస్త్రంగా వాడుకుని గెలిచిన త‌రువాత మ‌రిచిపోయిన అంశాన్ని గిరిజ‌నులు గుర్తుపెట్టుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Also Read : Murder: ఇంటికి రమ్మని భార్య ప్రియుడికి భర్త ఫోన్.. నమ్మి రాగానే నరికేశారు

నాటీ మీ టీఆర్ఎస్ 2018 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో సైతం పోడు భూముల అంశాన్ని ప్రస్తావించారు. 2019 మార్చిలో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల సాక్షిగా పోడు భూములు చేసుకుంటున్న గిరిజ‌నుల‌కు హ‌క్కు ప‌త్రాలు ఇస్తామ‌ని ప్రకటించారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. 2019 జులై 19న అసెంబ్లీలో గిరిజ‌నుల‌కు పోడు భూముల ప‌ట్టాలు ఇచ్చేందుకు అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటాన‌ని ప్రకటించారు. గ‌త ఫిబ్రవరిలో జరిగిన సమావేశాల్లో 11.50 లక్షల ఎక‌రాక‌లు పోడు భూముల‌కు ప‌ట్టాలిస్తామ‌ని కేసీఆర్ ప్రకటించారు.. ఆర్థిక శాఖామంత్రి హ‌రీష్ రావు గ‌త నెల 9న జరిగిన మంత్రివ‌ర్గ స‌మావేశాల్లో ల‌క్ష 55 వేల 393 మందికే మొద‌టి విడ‌త‌లో హ‌క్కు ప‌త్రాలు ఇస్తామ‌ని ప్రకటించారు.. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Also Read : Justice Radhakrishnan Away : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కన్నుమూత

నాలుగు లక్షల మంది గిరిజనులు హక్కు పత్రాల కోసం ఎదురుచూస్తుంటే 1.5 లక్షల మందికే పట్టాలిస్తామడం.. గిరిజనులను నిట్టనిలువునా మోసం చేయడమే.. కేంద్ర అటవి హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవి ఫలాలపై, పోడు భూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయి.. గిరిజనులకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరం అని సీఎల్పీ నేత భట్టి అన్నారు. ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వం జాబితాను విడుదల చేయాలి.. పోడు భూముల సమస్యలపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి.. పోడుభూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలి.. పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయకుంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు.