Bhatti Vikramarka : కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లను స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని ఆరోపించారు. నేరుగా తెచ్చిన అప్పులు బడ్జెట్లో చూపించారు. కార్పొరేషన్ లకు గ్యారెంటీ ఇచ్చి అప్పులు తెచ్చింది ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు.
Also Read
ఇప్పుడు నేరుగా తెచ్చిన అప్పులతో కార్పొరేషన్ అప్పులను కూడా కేంద్రం కలిపి చూస్తుందని, కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని, ప్రతి బడ్జెట్లో వాస్తవాలు దాచారు అని చెప్పినా.. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటింది అంటూ ఆయన విమర్శించారు. అప్పులు ఆగిపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా కడతారని, మేము చెప్పినప్పుడు మాట వింటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో బాగున్నప్పుడు ఒక మాదిరిగా.. బాగొలేనప్పుడు ఒక మాదిరిగా కేంద్రం వ్యవహారం ఉందని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్గా ఈ ఆర్ధిక పరిస్థితి చూస్తే బాధేస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో