Viral Video: మట్టిపాత్రలో వంట చేయాలనుకున్న యువతి.. స్టవ్ మీద పెట్టగానే ఏం జరిగిందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clay Pot Breaks Down After a woman Try to Cook in it On Gas Stove: ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ వినియోగం పెరిగిపోయిన తరువాత వాటిని చూసి కొంత మంది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇక వంటల విషయంలో అయితే ఆ ప్రయోగాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే కొన్ని సార్లు ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొడుతూ ఉంటాయి. లక్ బాగోలేకపోతే ప్రమాదం కూడా జరిగి ఆసుపత్రి పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Viral Video: వాటిని అలా కూడా దాస్తారా? కొత్తగా కొన్న ఇంటి గోడలో ఉన్నది చూసి షాకైన ఓనర్
Also Read
ప్రస్తుతం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ట్రెండ్ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ పాత కాలం నాటి వస్తువులు, ఆభరణాలు, స్టైల్స్ ను ఫాలో అవుతున్నారు జనాలు. ఇక ఆరోగ్యం కూడా జనాలకు ఈ మధ్య శ్రద్ద ఎక్కువయ్యిపోయింది. ఆరోగ్యం ఉండటం కోసం ప్లాస్టిక్ ను వాడటం మానేస్తున్నారు. వాటి స్థానంలో పాత కాలంలో వాడిన మట్టిపాత్రలు, ఇత్తడి వస్తువులు, కాపర్ లాంటివి ఉపయోగిస్తున్నారు. ఇదిలా వుండగా మట్టి పాత్రలో వంట చేయాలనుకున్న ఓ యువతికి అనూహ్య ఘటన ఎదురయ్యింది. వంట చేయడానికి పెట్టిన మట్టి పాత్ర ఒక్కసారిగా పగిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో మొదట ఫర్హా అఫ్రీన్ అనే అమ్మాయి వంట చేయడానికి ఓ మట్టిపాత్రను గ్యాస్ స్టవ్ మీద ఉంచుతుంది. అనంతరం దానిలో నెయ్యి వేసి అది మరిగాక పోపు వేయాలనుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఆ మట్టి పాత్ర పేలి పోతుంది. దీంతో ఆ యువతి షాక్ కు గురవుతుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్త అంటూ క్యాప్షన్ జోడించి ఆ యువతి ఈ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ ఘటనలో ఆ యువతికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది చూసిన నెటిజన్లు మట్టి పాత్రల్లో ఎలా పడితే అలా వంట చేయకూడదని సూచిస్తున్నారు. కొంతమంది వంట చేయడానికి వాడే మట్టి పాత్రలు వేరుగా ఉంటాయంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!