పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడంలో హీరో విక్రమ్ తర్వాతే ఎవరైనా. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ‘తంగలాన్’, ‘వీర ధీర శూరన్’ వంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తెచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ను అందుకోలేకపోయాయి. అయితే ఈ ఏడాది మాత్రం విక్రమ్ గట్టి వేటకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఒకేసారి నాలుగు కొత్త చిత్రాలను ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు చియాన్ విక్రమ్.
Also Read : Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?
తాజాగా తన అప్ కమింగ్ మూవీస్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.. ‘‘కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒకలాంటి ప్రిపరేషన్ లాంటిదే. ఈ సంవత్సరం నన్ను కదిలించే కథల కోసం ఎదురుచూస్తూ గడిపాను. నేను ఎంతో ఆరాధించే దర్శకులతో విభిన్నమైన నాలుగు చిత్రాలతో రాబోతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణాలను అభిమానులతో పంచుకోవడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ప్రస్తుతానికి ఆ నాలుగు సినిమాల కథలు ఏంటి? ఆ స్టార్ డైరెక్టర్లు ఎవరు? అనే విషయాలను విక్రమ్ ఇంకా సీక్రెట్గానే ఉంచారు.
అయితే విక్రమ్ మార్క్ ప్రయోగాలు, పక్కా మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తన కెరీర్లో వరుస ఫ్లాపుల తర్వాత ఈ నాలుగు చిత్రాలతో విక్రమ్ మళ్ళీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ 4 సినిమాల పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.