Chit Fund Scam: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.10 కోట్లతో జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chit Fund Scam: సామాన్య పేద ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్స్ను టార్గెట్గా చేసుకుని చిట్టీల పేరుతో చేసిన మోసం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. సింగరాయకొండలో నమ్మి చిట్టీలు కట్టిన బాధితుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుడు కాకుమాను శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఉడాయించటంతో ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవటంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
READ ALSO: HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
గత పదేళ్లుగా స్థానికంగా ప్రొవిజన్స్ షాపును నిర్వహించే శ్రీనివాసరావు సామాన్య పేదలు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా చేసుకున్నాడు. 50కి పైగా వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో చిట్టీల పేరుతో వసూలు చేశాడు. రూ. 10 కోట్లకు పైగా నగదు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. శ్రీనివాసరావు నివసిస్తున్న మూలగుంటపాడు, విద్యానగర్ ఏరియాలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉన్నారు. వారిని పరిచయం చేసుకొని చిట్టీలు కట్టించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత .. గత 6 నెలల నుంచి చిట్టీలకు సంబంధించిన అమౌంట్ చీటీదారులకు చెల్లించటం లేదు. అతని దగ్గర చిట్టీలు కట్టి పాడిన వ్యక్తులు తమ డబ్బు కోసం ఫోన్లు చేయటంతో స్పందించలేదు. శ్రీనివాసరావు నగదు చెల్లించకుండా, ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసిన బాధితులకు షాక్ తగిలింది. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాసరావు తన ఇంటిని సైతం అమ్ముకొని పరారయ్యాడని గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద 1. 72 కోట్ల రూపాయలు చీటీల రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రతీ నెల చిట్టీలు కట్టిన సభ్యులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు తప్పించుకుని పరారయ్యాడని వాపోతున్నారు. ఆయన దగ్గర దాదాపుగా రూ. 10 కోట్లకు పైగా చిట్స్ వ్యాపారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు చిట్టీలు, ఫైనాన్స్ పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సింగరాయకొండలో జరిగిన ఈ భారీ మోసం ఇంకా ఎన్ని కుటుంబాలను దెబ్బతీసిందో పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది.
READ ALSO: Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!