Chit Fund Scam: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.10 కోట్లతో జంప్!
Chit Fund Scam: సామాన్య పేద ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్స్ను టార్గెట్గా చేసుకుని చిట్టీల పేరుతో చేసిన మోసం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. సింగరాయకొండలో నమ్మి చిట్టీలు కట్టిన బాధితుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుడు కాకుమాను శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఉడాయించటంతో ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవటంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
READ ALSO: HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
గత పదేళ్లుగా స్థానికంగా ప్రొవిజన్స్ షాపును నిర్వహించే శ్రీనివాసరావు సామాన్య పేదలు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా చేసుకున్నాడు. 50కి పైగా వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో చిట్టీల పేరుతో వసూలు చేశాడు. రూ. 10 కోట్లకు పైగా నగదు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. శ్రీనివాసరావు నివసిస్తున్న మూలగుంటపాడు, విద్యానగర్ ఏరియాలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉన్నారు. వారిని పరిచయం చేసుకొని చిట్టీలు కట్టించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత .. గత 6 నెలల నుంచి చిట్టీలకు సంబంధించిన అమౌంట్ చీటీదారులకు చెల్లించటం లేదు. అతని దగ్గర చిట్టీలు కట్టి పాడిన వ్యక్తులు తమ డబ్బు కోసం ఫోన్లు చేయటంతో స్పందించలేదు. శ్రీనివాసరావు నగదు చెల్లించకుండా, ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసిన బాధితులకు షాక్ తగిలింది. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాసరావు తన ఇంటిని సైతం అమ్ముకొని పరారయ్యాడని గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద 1. 72 కోట్ల రూపాయలు చీటీల రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రతీ నెల చిట్టీలు కట్టిన సభ్యులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు తప్పించుకుని పరారయ్యాడని వాపోతున్నారు. ఆయన దగ్గర దాదాపుగా రూ. 10 కోట్లకు పైగా చిట్స్ వ్యాపారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు చిట్టీలు, ఫైనాన్స్ పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సింగరాయకొండలో జరిగిన ఈ భారీ మోసం ఇంకా ఎన్ని కుటుంబాలను దెబ్బతీసిందో పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది.
READ ALSO: Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
తాజావార్తలు
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
-
Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
-
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?