Chit Fund Scam: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.10 కోట్లతో జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chit Fund Scam: సామాన్య పేద ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్స్ను టార్గెట్గా చేసుకుని చిట్టీల పేరుతో చేసిన మోసం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. సింగరాయకొండలో నమ్మి చిట్టీలు కట్టిన బాధితుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుడు కాకుమాను శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఉడాయించటంతో ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవటంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
READ ALSO: HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
గత పదేళ్లుగా స్థానికంగా ప్రొవిజన్స్ షాపును నిర్వహించే శ్రీనివాసరావు సామాన్య పేదలు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా చేసుకున్నాడు. 50కి పైగా వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో చిట్టీల పేరుతో వసూలు చేశాడు. రూ. 10 కోట్లకు పైగా నగదు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. శ్రీనివాసరావు నివసిస్తున్న మూలగుంటపాడు, విద్యానగర్ ఏరియాలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉన్నారు. వారిని పరిచయం చేసుకొని చిట్టీలు కట్టించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత .. గత 6 నెలల నుంచి చిట్టీలకు సంబంధించిన అమౌంట్ చీటీదారులకు చెల్లించటం లేదు. అతని దగ్గర చిట్టీలు కట్టి పాడిన వ్యక్తులు తమ డబ్బు కోసం ఫోన్లు చేయటంతో స్పందించలేదు. శ్రీనివాసరావు నగదు చెల్లించకుండా, ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసిన బాధితులకు షాక్ తగిలింది. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాసరావు తన ఇంటిని సైతం అమ్ముకొని పరారయ్యాడని గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద 1. 72 కోట్ల రూపాయలు చీటీల రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రతీ నెల చిట్టీలు కట్టిన సభ్యులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు తప్పించుకుని పరారయ్యాడని వాపోతున్నారు. ఆయన దగ్గర దాదాపుగా రూ. 10 కోట్లకు పైగా చిట్స్ వ్యాపారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు చిట్టీలు, ఫైనాన్స్ పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సింగరాయకొండలో జరిగిన ఈ భారీ మోసం ఇంకా ఎన్ని కుటుంబాలను దెబ్బతీసిందో పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది.
READ ALSO: Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..