Chit Fund Scam: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.10 కోట్లతో జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chit Fund Scam: సామాన్య పేద ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్స్ను టార్గెట్గా చేసుకుని చిట్టీల పేరుతో చేసిన మోసం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. సింగరాయకొండలో నమ్మి చిట్టీలు కట్టిన బాధితుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుడు కాకుమాను శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఉడాయించటంతో ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవటంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
READ ALSO: HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
Also Read
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
గత పదేళ్లుగా స్థానికంగా ప్రొవిజన్స్ షాపును నిర్వహించే శ్రీనివాసరావు సామాన్య పేదలు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా చేసుకున్నాడు. 50కి పైగా వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో చిట్టీల పేరుతో వసూలు చేశాడు. రూ. 10 కోట్లకు పైగా నగదు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. శ్రీనివాసరావు నివసిస్తున్న మూలగుంటపాడు, విద్యానగర్ ఏరియాలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉన్నారు. వారిని పరిచయం చేసుకొని చిట్టీలు కట్టించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత .. గత 6 నెలల నుంచి చిట్టీలకు సంబంధించిన అమౌంట్ చీటీదారులకు చెల్లించటం లేదు. అతని దగ్గర చిట్టీలు కట్టి పాడిన వ్యక్తులు తమ డబ్బు కోసం ఫోన్లు చేయటంతో స్పందించలేదు. శ్రీనివాసరావు నగదు చెల్లించకుండా, ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసిన బాధితులకు షాక్ తగిలింది. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాసరావు తన ఇంటిని సైతం అమ్ముకొని పరారయ్యాడని గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద 1. 72 కోట్ల రూపాయలు చీటీల రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రతీ నెల చిట్టీలు కట్టిన సభ్యులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు తప్పించుకుని పరారయ్యాడని వాపోతున్నారు. ఆయన దగ్గర దాదాపుగా రూ. 10 కోట్లకు పైగా చిట్స్ వ్యాపారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు చిట్టీలు, ఫైనాన్స్ పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సింగరాయకొండలో జరిగిన ఈ భారీ మోసం ఇంకా ఎన్ని కుటుంబాలను దెబ్బతీసిందో పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది.
READ ALSO: Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?