NTV Telugu Site icon

Janasena: మరో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు..

Chirri Balaraju

Chirri Balaraju

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకుని పని చేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.

Read Also: BJP: బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం.. ఖరారు కానున్న స్థానాలు, అభ్యర్థులు

ఇదిలా ఉంటే.. కాసేపటి క్రితమే పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. తొలుత తెలుగుదేశం ఫస్ట్ లిస్టులో మహాసేన రాజేష్ కు గన్నవరం సీటు కేటాయించారు. మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల తెలుగుదేశం జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టిక్కెట్ మార్పు చేశారు.

Read Also: Kejriwal: అరెస్ట్‌, కస్టడీపై హైకోర్టుకెళ్లిన కేజ్రీవాల్.. ఎమర్జెన్సీ విచారణకు విజ్ఞప్తి