NTV Telugu Site icon

Chiranjeevi Movies Sequel: అతి త్వరలోనే చిరు బ్లాక్ బస్టర్స్​కు సీక్వెల్​: అశ్వినీ దత్​

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi Movies Sequel: మెగాస్టార్ సినిమా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలలో ఇంద్ర (Indra), జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari)లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఇకపోతే., ఈ సినిమాలకు చాలా రోజుల నుంచి అభిమానులు సీక్వెల్ తెరకెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా., ఈ విషయంపై నిర్మాత అశ్వినీ దత్ స్పందించాడు. ఈ సందర్బంగా ఆయన చెప్పిన మాటలు వింటే.. మెగాస్టార్ అభిమానులకు నిజంగా పండుగలాంటి విషయమే. ఇక అసలు విషయం చూస్తే..

Devara : దేవర డబుల్ షేడ్ చూసారా.. ఇక్కడ చూసేయండి..

మెగాస్టార్ చిరు 69వ పుట్టినరోజు పురస్కరించుకొని ఇంద్ర సినిమా రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఇంద్ర చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిపించి సన్మానించడం జరిగింది కూడా. ఈ కార్యక్రమంలో దర్శకుడు బి.గోపాల్, నిర్మాత అశ్విని దత్ ఇంకా రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మొదలగు వారు పాల్గొన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో చిరంజీవి శాలువాలు కప్పి సన్మానించారు.

Indian Players As Coaches: అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు కోచ్‌లుగా పనిచేసిన టీమిండియా ఆటగాళ్లు ఏవంరంటే..

ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నిర్మాత అశ్వినీదత్ మీడియా పూర్వకంగా మాట్లాడుతూ.. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర సినిమాల సీక్వెన్స్ తీసుకోవచ్చేందుకు తాను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని., వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే తెలియచేస్తానని ఆయన తెలిపారు. ఇకపోతే., జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వి కపూర్ నటించాలని ఇదివరకు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన సంగతి తెలిసిందే.