IND vs NZ: భారత్పై విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ఎక్కువ.. సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం
- సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు
- డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత గడ్డపై టీమిండియాపై విజయంను తాము డబ్ల్యూటీసీ ఫైనల్లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ తెలిపాడు. బెంగళూరు టెస్టులో టాస్తో అదృష్టం కలిసొచ్చిందని, ఒకవేళ భారత్ మొదట బౌలింగ్ తీసుకొని ఉంటే తమకు కష్టాలు ఉండేవే అని చెప్పాడు. రెండో టెస్టులో మాత్రం తాము అనుకున్నట్లుగానే ఆడి ఫలితం రాబట్టాం అని సౌథీ చెప్పుకొచ్చాడు. భారత్తో మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే.. న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌథీ మీడియాతో మాట్లాడాడు.
‘భారత్ సొంతగడ్డపై గత 12 ఏళ్ల నుంచి వరుసగా 18 సిరీస్లు గెలిచింది. ఏ జట్టుకైనా భారత్లో ఆడటం చాలా కష్టం. నేను ఇక్కడ చాలా మ్యాచ్లు ఆడాను. ఆస్ట్రేలియాలో కూడా ఆడటం కూడా చాలా కష్టమే. అక్కడి పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ఇరు ప్రత్యర్థులు కూడా నాణ్యమైన క్రికెట్ ఆడతారు. అందుకే విదేశీ జట్లకు గెలుపు అంత తేలిక కాదు. భారత్లో మేం విజేతగా నిలిచాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఈ విజయం మేం డబ్ల్యూటీసీ ఫైనల్లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం’ అని టిమ్ సౌథీ చెప్పాడు.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- 7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
Also Read: Ola Boss Offer: 72 గంటల రష్ సేల్.. ఓలా ఎస్1 పోర్ట్ఫోలియోపై 25 వేల తగ్గింపు!
‘బెంగళూరు టెస్టులో మాకు టాస్ ద్వారా అదృష్టం కలిసొచ్చింది. ఒకవేళ టీమిండియా మొదట బౌలింగ్ తీసుకొని ఉంటే.. మాకు కష్టాలు తప్పక పోవచ్చు. బెంగళూరు వికెట్ అలా స్పందిస్తుందని ఎవరూ ఊహించరు. పరిస్థితులను ఉపయోగించుకుని.. మేం పైచేయి సాధించాం. పూణే టెస్టులో మాత్రం ప్రణాళికల ప్రకారం ఆడి విజయం సాధించాం. ఏ మ్యాచ్కైనా మరీ ఎక్కువగా ప్రీప్లాన్ చేయకూడదు. మేం అలా ఎప్పుడూ చేయం. అదే మా బలం అని నేను అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం వలనే మెరుగ్గా రాణిస్తున్నాం’ అని సౌథీ పేర్కొన్నాడు. 12 ఏళ్ల కిందట చివరిసారిగా స్వదేశంలో భారత్ ఓడింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు కూడా ఇక్కడ టెస్ట్ సిరీస్ను సాధించలేకపోయాయి. చివరకు కివీస్ టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
-
Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?