IND vs NZ: భారత్పై విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ఎక్కువ.. సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం
- సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు
- డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ఎక్కువ
భారత గడ్డపై టీమిండియాపై విజయంను తాము డబ్ల్యూటీసీ ఫైనల్లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ తెలిపాడు. బెంగళూరు టెస్టులో టాస్తో అదృష్టం కలిసొచ్చిందని, ఒకవేళ భారత్ మొదట బౌలింగ్ తీసుకొని ఉంటే తమకు కష్టాలు ఉండేవే అని చెప్పాడు. రెండో టెస్టులో మాత్రం తాము అనుకున్నట్లుగానే ఆడి ఫలితం రాబట్టాం అని సౌథీ చెప్పుకొచ్చాడు. భారత్తో మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే.. న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌథీ మీడియాతో మాట్లాడాడు.
‘భారత్ సొంతగడ్డపై గత 12 ఏళ్ల నుంచి వరుసగా 18 సిరీస్లు గెలిచింది. ఏ జట్టుకైనా భారత్లో ఆడటం చాలా కష్టం. నేను ఇక్కడ చాలా మ్యాచ్లు ఆడాను. ఆస్ట్రేలియాలో కూడా ఆడటం కూడా చాలా కష్టమే. అక్కడి పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ఇరు ప్రత్యర్థులు కూడా నాణ్యమైన క్రికెట్ ఆడతారు. అందుకే విదేశీ జట్లకు గెలుపు అంత తేలిక కాదు. భారత్లో మేం విజేతగా నిలిచాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఈ విజయం మేం డబ్ల్యూటీసీ ఫైనల్లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం’ అని టిమ్ సౌథీ చెప్పాడు.
Also Read
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
- KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Also Read: Ola Boss Offer: 72 గంటల రష్ సేల్.. ఓలా ఎస్1 పోర్ట్ఫోలియోపై 25 వేల తగ్గింపు!
‘బెంగళూరు టెస్టులో మాకు టాస్ ద్వారా అదృష్టం కలిసొచ్చింది. ఒకవేళ టీమిండియా మొదట బౌలింగ్ తీసుకొని ఉంటే.. మాకు కష్టాలు తప్పక పోవచ్చు. బెంగళూరు వికెట్ అలా స్పందిస్తుందని ఎవరూ ఊహించరు. పరిస్థితులను ఉపయోగించుకుని.. మేం పైచేయి సాధించాం. పూణే టెస్టులో మాత్రం ప్రణాళికల ప్రకారం ఆడి విజయం సాధించాం. ఏ మ్యాచ్కైనా మరీ ఎక్కువగా ప్రీప్లాన్ చేయకూడదు. మేం అలా ఎప్పుడూ చేయం. అదే మా బలం అని నేను అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం వలనే మెరుగ్గా రాణిస్తున్నాం’ అని సౌథీ పేర్కొన్నాడు. 12 ఏళ్ల కిందట చివరిసారిగా స్వదేశంలో భారత్ ఓడింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు కూడా ఇక్కడ టెస్ట్ సిరీస్ను సాధించలేకపోయాయి. చివరకు కివీస్ టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…
-
DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
-
Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
-
KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
-
LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!