Covid-19: చైనా కావాలనే కొవిడ్ను మనుషులకు ఎక్కించింది: వుహాన్ పరిశోధకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి ఎలా పుట్టిందనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మనుషులకు ఎందుకు సోకింది అనే మూడేళ్లుగా సమాధానం లేని ప్రశ్నపై.. చైనాలో వుహాన్ నగరంలోని… వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ పరిశోధకుడు… ఆశ్చర్యకరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు. కరోనా వైరస్ని చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మనుషులకు ఎక్కించిందని ఆరోపించారు. ఆ పరిశోధకుడి పేరు చావో షావో. తన తోటివారు కరోనా వైరస్కి సంబంధించిన 4 రకాల స్ట్రెయిన్లను మనుషులకు ఎక్కించారనీ.. ఏ స్ట్రెయిన్ బాగా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి అలా చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read: Harassment: ఆసుపత్రిలో మహిళపై లైంగిక దాడికి యత్నం.. నర్సింగ్ అసిస్టెంట్ అరెస్ట్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
చావో షావో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో సైంటిస్ట్గా ఉన్నారు. ఆయన జెన్నీఫర్ జెంగ్ సంస్థకి ఇచ్చిన 26 నిమిషాల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. షాన్ చావో అనే మరో రీసెర్చర్కి తన పైఅధికారి 4 రకాల కరోనా స్ట్రెయిన్లను ఇచ్చి.. వాటిని పరిశోధించమని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ నాలుగు స్ట్రెయిన్లలో ఏది ఎక్కువ జాతులకు వేగంగా, తేలికగా వ్యాపించగలదు? అన్నది కనిపెట్టడమే దీని ఉద్దేశం అని తెలిపారు. చావో షావో ప్రకారం.. చైనా కరోనాను జీవ రసాయన ఆయుధంగా భావించింది.
2019లో వుహాన్లో మిలిటరీ వరల్డ్ గేమ్స్ జరిగినప్పుడు తన కొలీగ్స్ కొంతమంది కనిపించలేదన్న చావో షావో… గేమ్స్ ఆడేందుకు వచ్చే అథ్లెట్లకు, కరోనా సోకేలా చేసేందుకే వారిని అథ్లెట్లు ఉంటున్న హోటళ్లకు పంపారని తర్వాత తెలిసిందని ఇంటర్వ్యూలో చెప్పారు. 2020 ఏప్రిల్లో చావో షాన్ను ఉయిఘర్స్ ఉండే క్యాంపుల దగ్గరకు పంపారనీ.. వైరస్ని మనుషుల మధ్య వ్యాప్తి చెందేలా చేసేందుకే.. ఇలా చేశారని చావో షావో అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ ఆ వైరస్ ఇంకా సోకుతూనే ఉంది. దాని వ్యాప్తి, పుట్టుకపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మరి చావో షావో చెప్పింది ఎంతవరకూ నిజం అన్నది త్వరలో తెలిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!