వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నౌవి, వైమానిక విన్యాసాలను ఇవాళ (ఆదివారం) నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి తమ దేశాల మధ్య సముద్ర సహకార సంబంధాలను మరింత బలపర్చుకునేందుకు ఈ డ్రీల్ను నిర్వహిస్తామని ఆయా దేశాల రక్షణ చీఫ్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనికి “మారిటైమ్ కో- ఆపరేటివ్ యాక్టివిటీ” అని పేరును పెట్టారు. దీంట్లో భాగంగా నాలుగు దేశాలకు చెందిన నావికా, వైమానిక దళాలు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. ఇది ఇండో-పసిఫిక్కు మద్దతుగా స్వేచ్ఛను అందించడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు మిత్రదేశాల సమిష్టిగా ఈ విన్యాసాలను ప్రదర్శిస్తుందని వెల్లడించారు.
Read Also: Constable Suicide: హైదరాబాద్ లో ARSI బాలేశ్వర్ ఆత్మహత్య.. కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
కాగా, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫిలిప్పీన్స్, జపాన్ నాయకులతో మొదటి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి కొద్ది రోజుల ముందు ఈ డ్రీల్ను నిర్వహిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఇది వాణిజ్యం, వ్యాపారాల షిప్పింగ్కు ముఖ్యమైన మార్గంగా ఉంది. అయితే, గత కొంత కాలంగా ఈ ప్రాంతాన్ని డ్రాగన్ కంట్రీ చైనా తమదే అంటూ వాదిస్తుండగా.. ఇప్పుడు ఈ ప్రదేశంలో నాలుగు దేశాలు నావికా, వైమానికి విన్యాసాలను చేపట్టబోతున్నాయి.