Apple IPhone: యాపిల్కు భారీ దెబ్బ!.. ఆ దేశంలో ఆఫీస్ పనులకు ఐఫోన్లు వాడొద్దట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple IPhone: సాధారణంగా చైనా ప్రొడక్ట్స్ గురించి ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. అదే తరహాలో చైనాకు కూడా భద్రతాపరమైన భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఐఫోన్లను ఉపయోగించవద్దని చైనా ప్రభుత్వం కోరింది. పని కోసం ఆ పరికరాన్ని ఉపయోగించవద్దని లేదా వాటిని కార్యాలయంలోకి తీసుకురావద్దని ప్రభుత్వం ఆదేశించింది. యాపిల్కు చెందిన ఐఫోన్, ఇతర విదేశీ-బ్రాండెడ్ పరికరాలను పని కోసం ఉపయోగించవద్దని లేదా కార్యాలయానికి తీసుకురావద్దని చైనా కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులను ఆదేశించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం నివేదించింది.
Also Read: King Cobra: ఇంట్లోకి కింగ్ కోబ్రా, చాకచక్యంగా పట్టుకున్న క్యాచర్.. వీడియో ఇదిగో!
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
ఇది కొత్త విధానం విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దేశం నుంచి సున్నితమైన సమాచార ప్రవాహాన్ని పరిమితం చేయడానికి చైనా చేసిన ప్రయత్నమని సమాచారం. చాట్ గ్రూపులు లేదా సమావేశాల ద్వారా కార్యాలయంలోకి అలాంటి పరికరాలను తీసుకురావద్దని కొన్ని కేంద్ర ఏజెన్సీలలోని ఉద్యోగులకు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ అయినట్లు వాల్స్ట్రీట్ పేర్కొంది. యాపిల్ సహా ఇతర దేశాలకు చెందిన ఏ ఫోన్లనూ కార్యాలయాలకు తీసుకురాకూడదని సూచించినట్లు సమాచారం. అయితే యాపిల్తో పాటు ఏయే ఫోన్లను తీసుకురావొద్దన్నది ఉత్తర్వు పేర్కొందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని ఏజెన్సీలలోని ప్రభుత్వ అధికారులను ఐఫోన్లను ఉపయోగించకుండా చైనా అనేక సంవత్సరాల పాటు నిషేధించింది. అయితే తాజా ఆర్డర్ ఈ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా చేయడానికి ప్రయత్నించింది.
యాపిల్కు అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి కావడం గమనార్హం. యాపిల్కు దాదాపు ఐదో వంతు ఆదాయం చైనా నుంచే వస్తోంది. త్వరలో యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..