Apple IPhone: యాపిల్కు భారీ దెబ్బ!.. ఆ దేశంలో ఆఫీస్ పనులకు ఐఫోన్లు వాడొద్దట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple IPhone: సాధారణంగా చైనా ప్రొడక్ట్స్ గురించి ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. అదే తరహాలో చైనాకు కూడా భద్రతాపరమైన భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఐఫోన్లను ఉపయోగించవద్దని చైనా ప్రభుత్వం కోరింది. పని కోసం ఆ పరికరాన్ని ఉపయోగించవద్దని లేదా వాటిని కార్యాలయంలోకి తీసుకురావద్దని ప్రభుత్వం ఆదేశించింది. యాపిల్కు చెందిన ఐఫోన్, ఇతర విదేశీ-బ్రాండెడ్ పరికరాలను పని కోసం ఉపయోగించవద్దని లేదా కార్యాలయానికి తీసుకురావద్దని చైనా కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులను ఆదేశించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం నివేదించింది.
Also Read: King Cobra: ఇంట్లోకి కింగ్ కోబ్రా, చాకచక్యంగా పట్టుకున్న క్యాచర్.. వీడియో ఇదిగో!
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
ఇది కొత్త విధానం విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దేశం నుంచి సున్నితమైన సమాచార ప్రవాహాన్ని పరిమితం చేయడానికి చైనా చేసిన ప్రయత్నమని సమాచారం. చాట్ గ్రూపులు లేదా సమావేశాల ద్వారా కార్యాలయంలోకి అలాంటి పరికరాలను తీసుకురావద్దని కొన్ని కేంద్ర ఏజెన్సీలలోని ఉద్యోగులకు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ అయినట్లు వాల్స్ట్రీట్ పేర్కొంది. యాపిల్ సహా ఇతర దేశాలకు చెందిన ఏ ఫోన్లనూ కార్యాలయాలకు తీసుకురాకూడదని సూచించినట్లు సమాచారం. అయితే యాపిల్తో పాటు ఏయే ఫోన్లను తీసుకురావొద్దన్నది ఉత్తర్వు పేర్కొందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని ఏజెన్సీలలోని ప్రభుత్వ అధికారులను ఐఫోన్లను ఉపయోగించకుండా చైనా అనేక సంవత్సరాల పాటు నిషేధించింది. అయితే తాజా ఆర్డర్ ఈ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా చేయడానికి ప్రయత్నించింది.
యాపిల్కు అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి కావడం గమనార్హం. యాపిల్కు దాదాపు ఐదో వంతు ఆదాయం చైనా నుంచే వస్తోంది. త్వరలో యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!