Apple IPhone: యాపిల్కు భారీ దెబ్బ!.. ఆ దేశంలో ఆఫీస్ పనులకు ఐఫోన్లు వాడొద్దట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple IPhone: సాధారణంగా చైనా ప్రొడక్ట్స్ గురించి ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. అదే తరహాలో చైనాకు కూడా భద్రతాపరమైన భయం పట్టుకుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని చైనా తమ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఐఫోన్లను ఉపయోగించవద్దని చైనా ప్రభుత్వం కోరింది. పని కోసం ఆ పరికరాన్ని ఉపయోగించవద్దని లేదా వాటిని కార్యాలయంలోకి తీసుకురావద్దని ప్రభుత్వం ఆదేశించింది. యాపిల్కు చెందిన ఐఫోన్, ఇతర విదేశీ-బ్రాండెడ్ పరికరాలను పని కోసం ఉపయోగించవద్దని లేదా కార్యాలయానికి తీసుకురావద్దని చైనా కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులను ఆదేశించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం నివేదించింది.
Also Read: King Cobra: ఇంట్లోకి కింగ్ కోబ్రా, చాకచక్యంగా పట్టుకున్న క్యాచర్.. వీడియో ఇదిగో!
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఇది కొత్త విధానం విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దేశం నుంచి సున్నితమైన సమాచార ప్రవాహాన్ని పరిమితం చేయడానికి చైనా చేసిన ప్రయత్నమని సమాచారం. చాట్ గ్రూపులు లేదా సమావేశాల ద్వారా కార్యాలయంలోకి అలాంటి పరికరాలను తీసుకురావద్దని కొన్ని కేంద్ర ఏజెన్సీలలోని ఉద్యోగులకు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ అయినట్లు వాల్స్ట్రీట్ పేర్కొంది. యాపిల్ సహా ఇతర దేశాలకు చెందిన ఏ ఫోన్లనూ కార్యాలయాలకు తీసుకురాకూడదని సూచించినట్లు సమాచారం. అయితే యాపిల్తో పాటు ఏయే ఫోన్లను తీసుకురావొద్దన్నది ఉత్తర్వు పేర్కొందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని ఏజెన్సీలలోని ప్రభుత్వ అధికారులను ఐఫోన్లను ఉపయోగించకుండా చైనా అనేక సంవత్సరాల పాటు నిషేధించింది. అయితే తాజా ఆర్డర్ ఈ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా చేయడానికి ప్రయత్నించింది.
యాపిల్కు అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి కావడం గమనార్హం. యాపిల్కు దాదాపు ఐదో వంతు ఆదాయం చైనా నుంచే వస్తోంది. త్వరలో యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!