Turkey, Syria Earthquake : 22వేలు దాటిన మృతులు.. శిథిలాల కిందే వేలమంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey, Syria Earthquake :టర్కీ, సిరియా దేశాల్లో భూకంప విలయానికి మరణించినవారి సంఖ్య 22 వేలకు పెరిగింది. సుమారు 79 వేలమంది గాయపడ్డారు. నేలమట్టమైన శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని సహాయక బృందాలు రక్షిస్తూనే ఉన్నాయి. టర్కీ, సిరియాల్లో ప్రస్తుతం ఎటుచూసినా మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో నిండుకొని ఉంది. ఎటు చూసిన కుప్పకూలిన భవనాల శిథిలాలు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ చలి తీవ్రతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మృతుల సంఖ్య నమోదవుతుంది. ప్రస్తుతం వరకు 22వేల మందికిపైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. వేలాది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Read Also: Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
ఆ దేశాల్లో శిథిలాల నుండి రెస్క్యూ సిబ్బంది శుక్రవారం చాలా మందిని సజీవంగా కాపాడారు. టర్కీ నగరమైన కహ్రామన్మరాస్లో దాదాపు ఈ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. భూకంపం సంభవించి నేటికి ఐదవ రోజులవుతోంది. 105వ గంటలో అంటాక్యాలో శిథిలాల నుండి 18 నెలల యూసుఫ్ హుసేయిన్ను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మూడేళ్ల జేనెప్ ఎలా పర్లక్ కూడా రక్షించబడింది. అడియామాన్ ప్రావిన్స్లో 60 ఏళ్ల ఇయుప్ అక్ను రక్షించారు. గాజియాంటెప్లో పిల్లలతో సహా ఇద్దరు వ్యక్తులను సజీవంగా బయటకు తీశారు. గురువారం రక్షక సిబ్బంది 90 గంటల తర్వాత 10 రోజుల శిశువు, అతని తల్లిని సజీవంగా బయటకు తీశారు.
Read Also:Shocking: తన అంత్యక్రియలను తానే చేసుకున్న వృద్ధుడు
1939 నుండి సోమవారం నాటి టర్కీలోని తూర్పు ఎర్జింకన్ ప్రావిన్స్లో చూసిన భూకంపాల్లో ఇదే అతిపెద్దది. సోమవారం నాటి ప్రకంపనల కారణంగా టర్కీలో 18,991 మంది, సిరియాలో 3,377 మంది, కలిసి మొత్తం 22,368 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు. విపత్తు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!