Chhattisgarh Election 2023: ఛత్తీస్ గఢ్ రెండోదశ ఎన్నికలు.. 253మంది అభ్యర్థులు కోటీశ్వరులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Election 2023: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నవంబర్ 7న జరిగింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 17న జరగనుంది. ఈ చివరి దశలో మొత్తం 253 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో అత్యధికంగా రూ.447 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తమ తాజా నివేదికలో నవంబర్ 17న జరిగే ఓటింగ్లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు.
శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం అభ్యర్థుల సగటు ఆస్తి రూ.2 కోట్లు. 70 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 60 మంది అంటే 86 శాతం మంది కోటీశ్వరులేనని నివేదికలో పేర్కొంది. కాగా, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 మంది అంటే 81 శాతం మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జే) 62 మంది అభ్యర్థుల్లో 26 మంది అంటే 42 శాతం మంది, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 44 మందిలో 19 మంది అంటే 43 శాతం మంది కోటీశ్వరులే.
Also Read
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
Read Also:Israel-Gaza War: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి 22 మంది మృతి..
సీఎం భూపేష్ బఘేల్ ఆదాయం ఎక్కువ
ఆప్కి చెందిన విశాల్ కేల్కర్, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, బీజేపీకి చెందిన ఓపీ చౌదరి ఐటీఆర్లో అత్యధిక ఆదాయాన్ని ప్రకటించినట్లు నివేదిక పేర్కొంది. ఐటీఆర్లో కేల్కర్ మొత్తం రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని చూపించారని, ఆ తర్వాత భూపేష్ బఘేల్, ఓపీ చౌదరి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ప్రకటించారు.
కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధిక ఆస్తిపరులు
మిలియనీర్ అభ్యర్థులలో కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నారు. మొదటి మూడు సంపన్న అభ్యర్థులు అధికార కాంగ్రెస్కు చెందినవారే. వీటిలో అతిపెద్ద పేరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి TS సింగ్ దేవ్, సుర్గుజా మాజీ రాజ కుటుంబానికి చెందిన వారసుడు. తన సాంప్రదాయ అంబికాపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆస్తుల విలువ రూ.447 కోట్లకు పైగా ఉంది. దీని తర్వాత మనేంద్రగఢ్ స్థానం నుంచి రమేశ్ సింగ్ ఆస్తుల విలువ రూ.73 కోట్లు, రాజిమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అమితేశ్ శుక్లా ఆస్తులు రూ.48 కోట్లకు పైగా ఉన్నాయి.
Read Also:Liquor Sale : ఢిల్లీలో భారీగా మద్యం అమ్మకాలు.. 15 రోజుల్లో 2.58 కోట్ల సీసాలు
405 మంది అభ్యర్థులు పట్టభద్రులు
దీనితో పాటు 499 మంది అభ్యర్థులలో 52 శాతం మంది 5,12వ తరగతి మధ్య విద్యార్హతలను ప్రకటించారని, 405 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!