Chhattisgarh Election 2023: ఛత్తీస్ గఢ్ రెండోదశ ఎన్నికలు.. 253మంది అభ్యర్థులు కోటీశ్వరులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Election 2023: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నవంబర్ 7న జరిగింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 17న జరగనుంది. ఈ చివరి దశలో మొత్తం 253 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో అత్యధికంగా రూ.447 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తమ తాజా నివేదికలో నవంబర్ 17న జరిగే ఓటింగ్లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు.
శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం అభ్యర్థుల సగటు ఆస్తి రూ.2 కోట్లు. 70 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 60 మంది అంటే 86 శాతం మంది కోటీశ్వరులేనని నివేదికలో పేర్కొంది. కాగా, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 మంది అంటే 81 శాతం మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జే) 62 మంది అభ్యర్థుల్లో 26 మంది అంటే 42 శాతం మంది, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 44 మందిలో 19 మంది అంటే 43 శాతం మంది కోటీశ్వరులే.
Also Read
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
Read Also:Israel-Gaza War: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి 22 మంది మృతి..
సీఎం భూపేష్ బఘేల్ ఆదాయం ఎక్కువ
ఆప్కి చెందిన విశాల్ కేల్కర్, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, బీజేపీకి చెందిన ఓపీ చౌదరి ఐటీఆర్లో అత్యధిక ఆదాయాన్ని ప్రకటించినట్లు నివేదిక పేర్కొంది. ఐటీఆర్లో కేల్కర్ మొత్తం రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని చూపించారని, ఆ తర్వాత భూపేష్ బఘేల్, ఓపీ చౌదరి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ప్రకటించారు.
కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధిక ఆస్తిపరులు
మిలియనీర్ అభ్యర్థులలో కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నారు. మొదటి మూడు సంపన్న అభ్యర్థులు అధికార కాంగ్రెస్కు చెందినవారే. వీటిలో అతిపెద్ద పేరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి TS సింగ్ దేవ్, సుర్గుజా మాజీ రాజ కుటుంబానికి చెందిన వారసుడు. తన సాంప్రదాయ అంబికాపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆస్తుల విలువ రూ.447 కోట్లకు పైగా ఉంది. దీని తర్వాత మనేంద్రగఢ్ స్థానం నుంచి రమేశ్ సింగ్ ఆస్తుల విలువ రూ.73 కోట్లు, రాజిమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అమితేశ్ శుక్లా ఆస్తులు రూ.48 కోట్లకు పైగా ఉన్నాయి.
Read Also:Liquor Sale : ఢిల్లీలో భారీగా మద్యం అమ్మకాలు.. 15 రోజుల్లో 2.58 కోట్ల సీసాలు
405 మంది అభ్యర్థులు పట్టభద్రులు
దీనితో పాటు 499 మంది అభ్యర్థులలో 52 శాతం మంది 5,12వ తరగతి మధ్య విద్యార్హతలను ప్రకటించారని, 405 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!