Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో మరణించిన నక్సలైట్లలో ఆరుగురిపై రూ.48లక్షల రివార్డ్
- ఛత్తీస్గఢ్లో పోలీసులకు నక్సలైట్లకు మధ్య కాల్పులు
- ఎనిమిది మంది మావోలు హతం
- మరణించిన వారిలో ఆరుగురిపై భారీ రివార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని కొన్ని నిర్దిష్ట జిల్లాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా పిలుస్తారు. దీని కారణంగా స్థానికులు, గిరిజనులు, గ్రామీణ ప్రజలు భయపడేవారు. అయితే పోలీసులు ఈ ప్రాంతాలలో నక్సల్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో ఈ శనివారం ఎనిమిది మంది నక్సలైట్లను పోలీసులు హతమార్చారు. వారిలో ఆరుగురు సీనియర్ ర్యాంక్ కేడర్లు ఉన్నారు. ఈ నక్సలైట్లపై రూ.48 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా కుతుల్-ఫర్స్బెడా, కొడమెట గ్రామాల సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఆరుగురు నక్సలైట్లు సీనియర్ ర్యాంక్ కేడర్లని, వీరు మిలటరీ కంపెనీ నంబర్ 1 , పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి చెందిన మాద్ డివిజన్ సప్లై టీమ్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ నక్సలైట్లందరిపై దాదాపు రూ.48 లక్షల రివార్డును ప్రకటించారు.
Read Also:Konda Surekha: ఈద్గాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రత్యేక ప్రార్థనలు..
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
40 ఏళ్లలో మొదటిసారిగా ప్రజల్లో పోయిన భయం
బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నారాయణపూర్ పోలీసుల ‘మాద్ బచావో అభియాన్’ (నక్సల్ వ్యతిరేక ఆపరేషన్) వారంలో సాధించిన రెండవ అతిపెద్ద విజయం. మొత్తంగా 40ఏళ్లలో నాల్గవ అతిపెద్ద విజయం అని అన్నారు. నారాయణపూర్ జిల్లా అబుజ్మద్ ప్రజలు 40 ఏళ్లుగా నక్సలైట్ హింసకు గురవుతున్నారని, అయితే ఈ ప్రచారం తర్వాత ప్రజలు ఈ ప్రాంతాలను నక్సలైట్ రహిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ల గురించి మాట్లాడుతూ.. వీరిలో మరణించిన ఆరుగురు సీనియర్ ర్యాంక్ క్యాడర్లు మావోయిస్టుల గుర్తింపులోని పిఎల్జిఎ కంపెనీ నంబర్ 1లో వివిధ స్థానాల్లో చురుకుగా ఉన్నారని చెప్పారు ఈ నక్సలైట్లలో వర్గేష్, మమత, సమీర, కోసి, మోతీ. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మంది మరణించినప్పటికీ, వారిని ఇంకా గుర్తించలేదని, ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డు ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!