Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో మరణించిన నక్సలైట్లలో ఆరుగురిపై రూ.48లక్షల రివార్డ్
- ఛత్తీస్గఢ్లో పోలీసులకు నక్సలైట్లకు మధ్య కాల్పులు
- ఎనిమిది మంది మావోలు హతం
- మరణించిన వారిలో ఆరుగురిపై భారీ రివార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని కొన్ని నిర్దిష్ట జిల్లాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా పిలుస్తారు. దీని కారణంగా స్థానికులు, గిరిజనులు, గ్రామీణ ప్రజలు భయపడేవారు. అయితే పోలీసులు ఈ ప్రాంతాలలో నక్సల్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో ఈ శనివారం ఎనిమిది మంది నక్సలైట్లను పోలీసులు హతమార్చారు. వారిలో ఆరుగురు సీనియర్ ర్యాంక్ కేడర్లు ఉన్నారు. ఈ నక్సలైట్లపై రూ.48 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా కుతుల్-ఫర్స్బెడా, కొడమెట గ్రామాల సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఆరుగురు నక్సలైట్లు సీనియర్ ర్యాంక్ కేడర్లని, వీరు మిలటరీ కంపెనీ నంబర్ 1 , పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి చెందిన మాద్ డివిజన్ సప్లై టీమ్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ నక్సలైట్లందరిపై దాదాపు రూ.48 లక్షల రివార్డును ప్రకటించారు.
Read Also:Konda Surekha: ఈద్గాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రత్యేక ప్రార్థనలు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
40 ఏళ్లలో మొదటిసారిగా ప్రజల్లో పోయిన భయం
బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నారాయణపూర్ పోలీసుల ‘మాద్ బచావో అభియాన్’ (నక్సల్ వ్యతిరేక ఆపరేషన్) వారంలో సాధించిన రెండవ అతిపెద్ద విజయం. మొత్తంగా 40ఏళ్లలో నాల్గవ అతిపెద్ద విజయం అని అన్నారు. నారాయణపూర్ జిల్లా అబుజ్మద్ ప్రజలు 40 ఏళ్లుగా నక్సలైట్ హింసకు గురవుతున్నారని, అయితే ఈ ప్రచారం తర్వాత ప్రజలు ఈ ప్రాంతాలను నక్సలైట్ రహిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ల గురించి మాట్లాడుతూ.. వీరిలో మరణించిన ఆరుగురు సీనియర్ ర్యాంక్ క్యాడర్లు మావోయిస్టుల గుర్తింపులోని పిఎల్జిఎ కంపెనీ నంబర్ 1లో వివిధ స్థానాల్లో చురుకుగా ఉన్నారని చెప్పారు ఈ నక్సలైట్లలో వర్గేష్, మమత, సమీర, కోసి, మోతీ. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మంది మరణించినప్పటికీ, వారిని ఇంకా గుర్తించలేదని, ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డు ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!