Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో మరణించిన నక్సలైట్లలో ఆరుగురిపై రూ.48లక్షల రివార్డ్
- ఛత్తీస్గఢ్లో పోలీసులకు నక్సలైట్లకు మధ్య కాల్పులు
- ఎనిమిది మంది మావోలు హతం
- మరణించిన వారిలో ఆరుగురిపై భారీ రివార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని కొన్ని నిర్దిష్ట జిల్లాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా పిలుస్తారు. దీని కారణంగా స్థానికులు, గిరిజనులు, గ్రామీణ ప్రజలు భయపడేవారు. అయితే పోలీసులు ఈ ప్రాంతాలలో నక్సల్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో ఈ శనివారం ఎనిమిది మంది నక్సలైట్లను పోలీసులు హతమార్చారు. వారిలో ఆరుగురు సీనియర్ ర్యాంక్ కేడర్లు ఉన్నారు. ఈ నక్సలైట్లపై రూ.48 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా కుతుల్-ఫర్స్బెడా, కొడమెట గ్రామాల సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఆరుగురు నక్సలైట్లు సీనియర్ ర్యాంక్ కేడర్లని, వీరు మిలటరీ కంపెనీ నంబర్ 1 , పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి చెందిన మాద్ డివిజన్ సప్లై టీమ్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ నక్సలైట్లందరిపై దాదాపు రూ.48 లక్షల రివార్డును ప్రకటించారు.
Read Also:Konda Surekha: ఈద్గాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రత్యేక ప్రార్థనలు..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
40 ఏళ్లలో మొదటిసారిగా ప్రజల్లో పోయిన భయం
బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నారాయణపూర్ పోలీసుల ‘మాద్ బచావో అభియాన్’ (నక్సల్ వ్యతిరేక ఆపరేషన్) వారంలో సాధించిన రెండవ అతిపెద్ద విజయం. మొత్తంగా 40ఏళ్లలో నాల్గవ అతిపెద్ద విజయం అని అన్నారు. నారాయణపూర్ జిల్లా అబుజ్మద్ ప్రజలు 40 ఏళ్లుగా నక్సలైట్ హింసకు గురవుతున్నారని, అయితే ఈ ప్రచారం తర్వాత ప్రజలు ఈ ప్రాంతాలను నక్సలైట్ రహిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ల గురించి మాట్లాడుతూ.. వీరిలో మరణించిన ఆరుగురు సీనియర్ ర్యాంక్ క్యాడర్లు మావోయిస్టుల గుర్తింపులోని పిఎల్జిఎ కంపెనీ నంబర్ 1లో వివిధ స్థానాల్లో చురుకుగా ఉన్నారని చెప్పారు ఈ నక్సలైట్లలో వర్గేష్, మమత, సమీర, కోసి, మోతీ. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మంది మరణించినప్పటికీ, వారిని ఇంకా గుర్తించలేదని, ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డు ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?