Chhangur Baba: చంగూర్ బాబా కేసులో కీలక మలుపు.. ఈడీ కస్టడీలో సహచరుడు.. మతమార్పిడుల కుట్ర వెనుక భారీ నెట్వర్క్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhangur Baba: ఉత్తరప్రదేశ్ను కుదిపేస్తున్న అక్రమ మతమార్పిడుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంగూర్ బాబా వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. లక్నోలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (PMLA) కోర్టు సోమవారం చంగూర్ బాబాకు సన్నిహితుడిగా భావిస్తున్న నవీన్ రోహ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి అప్పగించింది. నవీన్ గతంలో యుపీ ఎటీఎస్ అరెస్ట్ చేసి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తు కోసం కోర్టులో కస్టడీ కోరగా, కోర్టు అందుకు ఆమోదించింది. ఇందులో భాగంగా ఈడీ తాజా విచారణ ప్రకారం, చంగూర్ బాబా తన డబ్బులను నేరుగా తన పేరుపై కాకుండా నవీన్ రోహ్రా, అతని భార్య నీతూ రోహ్రా (అలియాస్ నస్రీన్) పేర్లపై ఆస్తులుగా వేసినట్లు గుర్తించారు.
Mizoram Capital: మిజోరాం రాజధాని మార్పు? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.!
Also Read
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
ఇకపోతే, ఇప్పటికే గత నెలలో ఈడీ చంగూర్ బాబాను కూడా కస్టడీలోకి తీసుకుంది. బల్రాంపూర్ జిల్లా, ముంబయిలో రెండు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించగా, చంద్ ఔలియా దర్గాలో భారీగా అక్రమాలకు ఆధారాలు లభించాయి. అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం..చంగూర్ బాబా, అతని ముఠా మొత్తం 22 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.60 కోట్లకు పైగా నిధులు పొందినట్లు ఈడీ వెల్లడించింది. ఈ మొత్తం నిధుల్లో ఓ పెద్ద భాగం విదేశాల నుంచి వచ్చినవేనని తేలింది. చంగూర్ బాబా, అతని కుమారుడు మెహబూబ్, నవీన్ రోహ్రా, నీతూ రోహ్రా సహా నలుగురిపై యుపీ పోలీస్ గోమతి నగర్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు కొనసాగుతోంది.
Jair Bolsonaro: మాజీ అధ్యక్షుడుకి సుప్రీం కోర్ట్ షాక్.. హౌస్ అరెస్ట్కి ఆదేశాలు!
ఈ కుట్రలో దారుణమైన మతమార్పిడులు, విదేశీ నిధుల వినియోగం, జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్న కార్యకలాపాలున్నాయని ఎటీఎస్ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇందులో ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే.. చంగూర్ బాబా ప్రధానంగా దళితులు, ఆర్థికంగా వెనుకబడ్డ హిందూ వ్యక్తులపై లక్ష్యంగా పెట్టుకుని మతమార్పిడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పక్రియ సజావుగా నడిచే వ్యవస్థగా మారిందని, భారీ మొత్తంలో నిధులు వసూలు చేసి లక్షల రూపాయల విలువైన భవనాలు కొనుగోలు చేసి నిర్మాణాలు కూడా చేపట్టారని ఈడీ వెల్లడించింది. ఈ అక్రమాలకు సంబంధించి బల్రాంపూర్లో ఉన్న చంగూర్ బాబా నిర్మించిన కొన్ని భవనాలను యూపీ ప్రభుత్వం ఇటీవల కూల్చివేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ చర్యలను సమర్థిస్తూ.. ఇవి కేవలం సామాజికంగా కాక, జాతీయంగా ప్రమాదకరమైన చర్యలుగా అభివర్ణించారు
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!