NTV Telugu Site icon

Chennai Encounter: చెన్నైలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు రౌడీలను కాల్చిచంపిన పోలీసులు!

Encounter

Encounter

Two Rowdies shot dead by Kancheepuram police: చెన్నైలోని కాంచీపురంలో బుధవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీసులు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసు సిబ్బందిని నరికివేయడానికి ప్రయత్నించగా.. వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రఘువరన్ మరియు కరుప్పు హసన్ మరణించారు. ఓ హత్య కేసులో ఈ ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసుల బృందం ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రముఖ రౌడీ శరవణన్ అలియాస్ ప్రభాకరన్ (35)ను చంపిన కేసులో రఘువరన్ మరియు ఆసన్ (అలియాస్ కరుప్పు హసన్) నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరు కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి సమీపంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు వెల్లతురై నేతృత్వంలోని స్పెషల్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లగా.. నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. తమ వద్ద ఉన్న కొడవలి కత్తితో దాడి చేయడంతో ఏఎస్ఐ రామలింగం, కానిస్టేబుల్ శశికుమార్ గాయపడ్డారు.

Also Read: Sabarimala Temple Income: 39 రోజుల్లోనే.. 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం!

పోలీసులు హెచ్చరిస్తున్నా రఘువరన్, కరుప్పు హసన్ దాడి కొనసాగించారు. దాంతో తమ రక్షణ కోసం పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా.. ఇద్దరు రౌడీలు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరి మృతదేహాలను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పోలీసులు చికిత్స నిమిత్తం కాంచీపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రభాకరన్‌పై 30కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.