Site icon NTV Telugu

Chandrababu: నేడు మహారాష్ట్రకు చంద్రబాబు.. కొల్హాపూర్, షిర్డీలో ప్రత్యేక పూజలు..!

Babu

Babu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ( గురువారం ) మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయన కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అక్కడ.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం షిర్డికి చేరుకోనున్నారు. షిర్డీలో సాయిబాబా దేవాలయాన్ని దర్శి్స్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.

Read Also: SVC59 : విజయ్ సరసన నటించనున్న ఆ స్టార్ హీరోయిన్..?

అలాగే, ఎన్నికలు పూర్తైన తర్వాత చంద్రబాబు నాయుడు వరుసగా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ తర్వాత నేడు నేడు మహారాష్ట్ర వెళ్లనున్నారు. ప్రచారాన్ని ముగించిన సమయంలోనూ చంద్రబాబు చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాతో ఉన్న చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు.

Exit mobile version