Chandrababu: వాలంటీర్లను తొలగించబోం.. నాయుడుపేట సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం రేయింబవళ్లు పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. జగన్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని.. అన్ని అన్ని నిత్యవసర వస్తువుల ధరలు విద్యుత్ చార్జీలను గణనీయంగా పెంచారని ఆరోపించారు. అభ్యర్థుల ఎంపికను కూడా ప్రజల ద్వారానే చేశామని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో అన్ని వర్గాలూ దెబ్బ తిన్నాయన్నారు.
Read Also: Pithani Balakrishna: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కోసమే తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్ను ఏర్పాటు చేశామన్నారు. నాయుడుపేట.. సూళ్లూరు పేట ప్రాంతంలో ఎన్నో విదేశీ కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చామని చంద్రబాబు చెప్పారు. శ్రీ సిటీలో కూడా ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. కానీ జగన్ హయాంలో మాత్రం పరిశ్రమలు తరిమేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తిరుపతిలో అమర్ రాజా కంపెనీని తరిమేశారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. తన బ్రాండ్ చూసి కియా, టీసీఎల్ లాంటి కంపెనీలు వచ్చాయని.. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లను తీసుకు వచ్చామన్నారు.
Read Also: CM YS Jagan: లబ్ధి చేకూరింది.. తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాడికి ఎమ్మెల్యే సీటు.. దోపిడీ చేసే వారికి ఎంపీ సీటు జగన్ ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. వైయస్సార్ కంటే తాను ముందుగానే ముఖ్యమంత్రి అయ్యానన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. వాలంటీర్లకు నెలకు 5000 జీతం ఇస్తున్నారని.. బాగా చదువుకున్న వారు జగన్ ట్రాప్లో పడవద్దని కోరుతున్నామన్నారు. వాలంటీర్లను తొలగించబోమని హామీ ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. బాగా చదువుకున్న వాలంటీర్లు నెలకు రూ. 50 వేలు సంపాదించే మార్గాన్ని చూపిస్తామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణపైనే మొదటి సంతకం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!