హైటెక్స్ లో ఘనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 2025వ సంవత్సరానికి సంబంధించి అవార్డులను అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర నటులు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులకు పలు అవార్డులు అందజేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘సినిమా వాళ్లను ప్రోత్సహించడంలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంత వెనకబడి ఉంది. చంద్రబాబు నాయుడు ‘గద్దర్ అవార్డులని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయాలి. సినిమా వాళ్లను ఎంకరేజ్ చేయడంలో పక్క రాష్ట్రం పక్క రాష్ట్రం కొంచెం వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు రావాలని, కళాకారులను గౌరవించుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలని చిరంజీవి అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ‘నంది అవార్డుల’ పేరును ‘గద్దర్ అవార్డులు’గా మారుస్తూ, సినిమా వాళ్లను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అవార్డులు ఇవ్వాలని అన్నారు. అయితే చిరు చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. గత పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు మరి అప్పుడు చిరు ఏమి చేసారో చెప్పాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
