AP Election Results 2024: అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు
AP Election Results 2024: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయ 5 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.. ఈ టెలికాన్ఫరెన్స్ లో పురంధరేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3 పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు.. నిబంధనలకు పట్టుబట్టాలి. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు అని సూచించారు.
ఇక, కంట్రోల్ యూనిట్ నంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను.. కౌంటింగులో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలని సూచించారు చంద్రబాబు.. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీపడొద్దన్నారు. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కాగా, ఏపీలో పోలింగ్, పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని.. అల్లర్లకు ఆస్కారం లేకుండా పోలీసుల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 1,985 సున్నిత ప్రాంతాలు గుర్తించారు. రాష్ట్రానికి 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను దించారు.. కౌంటింగ్కు 5,600 మంది కేంద్ర బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇక, ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించిన విషయం విదితమే.
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!