Vijaysai Reddy: 14 ఏళ్ల సీఎంగా చేసిన ప్రతీ పని ఓ స్కామే.. చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaysai Reddy: 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతీ పని ఓ స్కామే.. చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు.. నిన్న టీడీపీ బంద్ లో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా స్పందించి మూయలేదన్నారు.. చంద్రబాబు ఆయన మహానాయకుడు అని నమ్మించే ప్రయత్నం చేసే మీడియా కూడా జీర్ణించుకోలేక పోతున్నారన్న ఆయన.. విద్యార్థి దశ నుంచే నేర పూరిత ఆలోచనలు చేసే చంద్రబాబు.. ఆయన సొంత మీడియా ఆయన విజనరీ ఉన్న నేత అని చేసిన ప్రచారం డొల్ల అని తేలిపోయిందన్నారు. సీమెన్స్ కంపెనీ పెట్టుబడుల్లో లోకేష్ ముఖ్య అనుచరుడు కిలారి రాజేష్ ది ప్రముఖ పాత్ర అని ఆరోపించారు సాయి రెడ్డి.
రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టించిన నేత చంద్రబాబు అని విమర్శించారు సాయిరెడ్డి.. ఆయన ఓటుకు నోటు రాజకీయాలు అందరికీ తెలుసని.. స్వతాహాగా కరిష్మా లేని నేత చంద్రబాబు.. కనీస నాయకత్వ లక్షణాలు లేవు.. ఆయన చేయని ఆరాచకాలు లేవు.. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఆయన ఇన్ సైడ్ ట్రేడింగ్ అందరికీ తెలుసు.. జ్యుడీషియల్ వ్యవస్థలో కూడా తన సొంత సామాజిక వర్గ నేతలతో స్టేలు తెప్పించుకునే నేత చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్ లోకేష్, కొన్ని మీడియా సంస్థలకు మింగుడు పడని అంశంగా పేర్కొన్నారు. లోకేష్ కు ధైర్యం ఉంటే చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్టే వెకేట్ చేయించాలని సవాల్ చేవారు. 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారు.. డబ్బులో ఒక్క రూపాయి కూడా రాలేదని సిమెన్స్ సంస్థ స్పష్టం చేసిందని.. కుంభకోణం చేసింది మొత్తం చంద్రబాబని ఈడీ కూడా బయట పెట్టింది.. ప్రతీ పనిలో ప్రజా ధనం దుర్వినియోగం చేసిన నేత చంద్రబాబు అని దుయ్యబట్టారు.
Also Read
- IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
- Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
- GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు టీడీపీ వాళ్లే ముందుకు రాలేదని విమర్శించారు సాయిరెడ్డి.. అందుకే బాబు రెప్రజెంటేటివ్స్ ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలతో ట్వీట్స్ పెట్టిస్తున్నారు.. చంద్రబాబు పరామర్శకు రావాలని స్పెషల్ ఫ్లైట్స్ పెడుతున్నారని ఆరోపించారు. ఇక, ఆరేళ్లలో అధికారంలోకి వాళ్ళు వచ్చే అవకాశం లేదు.. వాళ్ళు అధికారం లోకి వచ్చినా న్యాయంగా పనులు చేసిన మమ్మల్ని ఏం చేస్తారు..? అని ప్రశ్నించారు. ఇక, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ కోవర్ట్ అని మేం భావిస్తున్నాం అంటూ సంచలన ఆరోపణల చేశారు. జనసేన, టీడీపీ రెండు త్వరలో కలుస్తాయని అందరూ మాట్లాడుకునే మాట అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.
మరోవైపు ప్రకాశం జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ సమస్యలు గుర్తించి సరిదిద్దుతాం.. జిల్లాలో సమస్యలు పరిష్కరించే భాధ్యత బాలినేని శ్రీనివాసరెడ్డి చూసుకుంటారని తెలిపారు విజయసాయిరెడ్డి.. జిల్లాలో బాలినేని తిరుగులేని నేత.. బాలినేని ఆవేదన మాట వాస్తవం.. పార్టీలో బిన్నభిప్రాయాలు సరిచేస్తాం.. ఎవరో ఒక అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అరెస్టు జరిగింది అనటం అవాస్తవం అన్నారు. ఆధారాలు దొరికితే నారా లోకేష్ పై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు విజయసాయిరెడ్డి.
తాజావార్తలు
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..