Chandrababu: బీసీలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్.. రూ.4 వేలకు పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు చేస్తాం.. పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతాం అంటూ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంగళగిరి వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభలో.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత సభలో మాట్లాడుతూ.. బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు.. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో బీసీలకు ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్ల మేర కేటాయింపులు చేస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోత వేసిన రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తాం.. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకోస్తాం.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు ప్రత్యేక చట్టం. బీసీ పారిశ్రామిక వేత్తల ప్రొత్సహానికి రూ. 10 వేల కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు.
Read Also: Telangana CM: ప్రధాన మంత్రిని పెద్దన్న అంటే తప్పేముంది
Also Read
షరతుల్లేకుండా బీసీలకు విదేశీ విద్యను అమలు చేస్తాం అన్నారు చంద్రబాబు.. పీజీ విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్స్మెంట్ పునరుద్దరిస్తామన్న ఆయన.. బీసీల కోసం రూ. 10 లక్షలతో చంద్రన్న కానుక తీసుకొస్తాం అన్నారు. పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడతాం. ప్రతి ఏడాది కుల ధృవీకరణ తీసుకునే వ్యవస్థలను రద్దు చేస్తాం.. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తాం అన్నారు. బీసీ నాయకత్వంపై వైసీపీ గొడ్డలి వేటు వేసిందని విమర్శించారు చంద్రబాబు.. మంత్రిగా ఉండి.. ఎంపీ టిక్కెట్ వద్దని వైసీపీని వీడి మంత్రి గుమ్మనూరు వచ్చేశారు. గుమ్మనూరు ఏ తప్పు లేకుండానే సీటు మార్చారు.. తప్పు చేసిన వాళ్లని మార్చే దమ్ము ఉందా..? అని సవాల్ చేశారు. వైఎస్ జగన్కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ గా అభివర్ణించారు చంద్రబాబు.. ఇక, జయహో బీసీ బహిరంగ సభ వేదికగా చంద్రబాబు ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!