Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- భయపెడుతున్న చండీపుర వైరస్..
- గుజరాత్లో 22 మంది చిన్నారుల మరణం..
- చండీపుర వైరస్ లక్షణాలు, చికిత్స వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandipura virus: గుజరాత్లో ‘‘చండీపుర వైరస్’’ వ్యాప్తి కారణంగా కనీసం 22 మంది చిన్నారులు మరణించారు. సాధారణ జ్వరంగా కనిపించే ఈ వ్యాధి కొద్ది రోజులకే ప్రాణాంతకంగా మారుతుంది. మెదడు ఇన్ఫెక్షన్గా మారి ప్రాణాలు తీస్తోంది. ప్రస్తుతం గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా ప్రకారం, 184 అనుమానిత కేసులలో మరో 35 మందికి చండీపుర వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. చండీపుర వైరస్ వల్ల ఎన్సెఫలైటిస్ అనే పిలిచే తీవ్రమైన మెదడు వాపు రావచ్చు.
అసలేంటి ఈ వైరస్..?
చండీపుర వైరస్, లేదా సిహెచ్పివి (CHPV), రాబ్డోవైరిడే (Rhabdoviridae) కుటుంబంలోని వెసిక్యులోవైరస్ (Vesiculovirus) ప్రజాతికి చెందినది. ఇది ఒక ఆర్బో వైరస్, అంటే ప్రధానంగా ఈగల వంటి రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో ఈ కీటకాల బెడద ఎక్కువగా ఉండటంతో వైరస్ వ్యాప్తి కూడా అధికమవుతుంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లల్ని ప్రభావితం చేస్తుంది.
Also Read
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
- Dr Mohan Rao Patibandla: గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ వేదికపై త్రివిజయం.. ఒకే సదస్సులో మూడు పురస్కారాలు!
లక్షణాలు:
ఈ వ్యాధి సాధారణ జ్వరంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఫ్లూ తరహా లక్షణాలు ఉంటాయి. కొందరిలో వైరస్ వేగంగా మెదడుపై దాడి చేసిన ఎన్సెఫలైటిస్ (మెదడు వాపు)కు దారి తీస్తుంది. అయితే, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకపోవడం సంతోషకరమైన విషయం.
ఇది ఎంత ప్రమాదం.?
మెదడు వాపు వచ్చిన తర్వాత పరిస్థితి వేగంగా విషమిస్తుంది. మూర్చ, స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం వంటి సమస్యలు రావచ్చు. తీవ్రమైన కేసుల్లో ఆస్పత్రిలో చేరి 48 నుంచి 72 గంటల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకారం, చండీపురా వైరస్ సోకిన పిల్లల్లో మరణాల రేటు 55 నుంచి 77 శాతం వరకు నమోదైంది.
1965లో తొలిసారిగా గుర్తింపు..
చండీపురా వైరస్ను తొలిసారిగా 1965లో భారత్లోనే గుర్తించారు. పశ్చిమ, మధ్య భారత దేశంలో ఆ సమయంలో వ్యాధి పలుమార్లు వ్యాప్తి చెందింది. గత రెండు దశాబ్దాలలో అతిపెద్ద వ్యాప్తి 2024లో సంభవించింది, ఆ సమయంలో భారతదేశం 245 తీవ్రమైన ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ కేసులలో 82 మరణాలు సంభవించాయి. ఇందులో 64 చండీపుర ఇన్ఫెక్షన్లుగా నిర్ధారించారు.
చికిత్స ఉందా..?
ప్రస్తుతం చండీపుర కోసం వ్యాక్సిన్ లేదా నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. చికిత్స ప్రధానంగా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వ్యక్తి వైరస్పై పోరాడేలా చికిత్స అందిస్తారు. రోగ నిరోధక వ్యవస్థ వైరస్తో పోరాడుతున్నప్పుడు, వైద్యులు ఇతర శరీర ప్రక్రియలు విఫలం కాకుండా, ఇతర లక్షణాలు పెరగడకుండా సహాయక చికిత్స అందిస్తారు.
తాజావార్తలు
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!