Champions Trophy 2025 : 22మంది పండితులు చేతబడి చేసి మమ్మల్ని ఓడించారు.. పాక్ ఛానెళ్లలో చర్చ.. నవ్వుకుంటున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025 : ‘‘ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు విజయం సాధిస్తుందని 22 మంది పండితులు అంచనా వేశారు. ఈ 22 మంది పండిట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నియమించింది. టీమ్ ఇండియా స్టేడియం చేరుకునే ముందు ఏడుగురు పండితులు చేతబడి చేయడం ప్రారంభించారు. దీని తరువాత 22 మంది పండితులు కలిసి 11 మంది పాకిస్తానీ ఆటగాళ్ల దృష్టి మరల్చి భారత జట్టును గెలిపించారు.’’ ఇది నేను చెబుతున్న విషయం కాదు.. పాకిస్తానీ టీవీ ఛానెళ్లలో ఇదే చర్చ నడుస్తోంది.
పాకిస్తానీ వార్తా ఛానెల్ డిస్కవర్ పాకిస్తాన్ టీవీలో ఆరుగురు వ్యక్తుల ప్యానెల్ తమలో తాము మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో భారత్ ను గెలిపించడానికి పాకిస్తాన్ జట్టుపై చేతబడి చేయడానికి 22 మంది పండితులను భారతదేశం నియమించుకుందని ఒక ప్యానెలిస్ట్ పేర్కొన్నాడు. భారత జట్టు పాకిస్తాన్ కు రాకపోవడానికి ఇదే కారణమని తెలిపాడు. వాళ్ల పప్పులు ఇక్కడ ఉడకవు కాబట్టే దుబాయ్ లో భారత్ అలా చేస్తుంది.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also:Damodar Raja Narasimha: త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తేబోతున్నాం!
ఏడుగురు పండితులు ముందుగానే స్టేడియానికి చేరుకుంటారని మరొక వ్యక్తి పేర్కొన్నాడు. వారు మంత్రాలు చదువుతారని పేర్కొన్నారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్టేడియంలో కూర్చుని ప్రార్థనలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిలో వహాబ్ రియాజ్, ఆకాష్ చోప్రా, సురేష్ రైనా కూడా దీని గురించి మాట్లాడుకున్నారు.
27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్, ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించిన మొదటి దేశంగా నిలిచింది. మొదట న్యూజిలాండ్ చేతిలో, ఆ తర్వాత భారత జట్టు చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కు ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. దీనిని ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ లో ఆడతారు. భారత జట్టు చేతిలో ఓటమితో ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ప్రయాణం ముగిసిపోయింది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్ను న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారతదేశం నాలుగు పాయింట్లతో గ్రూప్ Aలో అగ్రస్థానానికి చేరుకుంది. సెమీ-ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Read Also:Preity Zinta: హీరోయిన్ బ్యాంక్ రుణంపై కాంగ్రెస్ ఆరోపణలు.. ప్రీతి జింటా హాట్ రియాక్షన్!
WATCH 😂😭pic.twitter.com/Rq960PO26e
— Times Algebra (@TimesAlgebraIND) February 24, 2025
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!