Yuzvendra Chahal: చహల్ నీకు జట్టులో స్థానం పొందే అర్హతే లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యంగ్ బౌలర్ యుజువేంద్ర చహల్కు జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. గత కొంతకాలంగా అతడు నిలకడలేమి ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో.. కుల్దీప్ యాదవ్.. తనకు వచ్చిన ఛాన్స్ ను ఒడిసి పట్టుకున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అవసరమైన టైంలో రాణిస్తున్నాడు. అయితే, చహల్ను కాదని సెలక్టర్లు కుల్దీప్ను ఎంపిక చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా తెలిపాడు. ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజీ చహల్కు సెలక్షన్ కమిటీ మొండిచేయి చూపించింది.
Read Also: Sharwanand: బ్రేకింగ్.. శర్వానంద్ కు సర్జరీ.. ?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
చహల్ ను కాదని మరో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపింది బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు చోటు లేదని.. ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి చూడలేమని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా.. ఆసియా కప్ జట్టు జాబితా నుంచే వన్డే వరల్డ్కప్కు ప్లేయర్స్ ను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ మెరుగ్గా రాణిస్తే ఐసీసీ ఈవెంట్పై కూడా చహల్ ఆశలు వదులుకోవాల్సిందేనని క్లారిటి ఇచ్చింది.
Read Also: CM YS Jagan: రేపు విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా సునీల్ గావాస్కర్ లాంటి దిగ్గజాలు చహల్ను జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్పిన్నర్లలో చహల్ను మించిన మరో ఒకరు లేరని అన్నారు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాత్రం బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు కామెంట్స్ చేయడం గమనార్హం. కాగా, ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబరు 2న టీమిండియా తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!