Big Breaking: కేంద్రం సంచలన నిర్ణయం.. సీఏఏ చట్టం అమలుకు నేడే నోటిఫినేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre likely to notify CAA rules today: త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’పై ఇవాళే రూల్స్ నోటిఫై చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత నేడు వాస్తవరూపం దాల్చనున్నట్లు సమాచారం. ఈ రాత్రిలోగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూల్స్ను నోటిఫై చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై నిషేధం
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఫిబ్రవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 2019లో అమలులోకి వచ్చిన సీఏఏ, ఈ ఏడాది లోక్సభ ఎన్నికలకు సంబంధించి నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలులోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 11, 2019న పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) భారతదేశం అంతటా తీవ్ర చర్చ, విస్తృత నిరసనలకు సంబంధించిన అంశం. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడం గమనార్హం. కానీ ఇంతవరకూ దీనిపై నిబంధనలు రూపొందించక పోవడంతో ఈ చట్టం అమలులోకి రాలేదు. ఈ క్రమంలోనే చట్టం నిబంధనపై కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలకు ముందే దీనిని అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
Read Also: Pakistan: షెహబాజ్ షరీఫ్ కేబినెట్లో 19 మందికి చోటు!
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ, క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన, అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారికి భారత పౌరసత్వానికి వేగవంతమైన మార్గాన్ని అందించడానికి 1955 పౌరసత్వ చట్టాన్ని కేంద్రం సవరించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వర పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందిస్తోంది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం నెలకొంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!