Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basmati Rice: దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం బాస్మతీ బియ్యం ముసుగులో తెలుపు బాస్మతీయేతర బియ్యం ‘అక్రమ’ ఎగుమతిని ఆపడానికి కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. టన్నుకు 1,200 డాలర్ల కంటే తక్కువ ఖరీదైన బాస్మతి బియ్యం ఎగుమతి అనుమతించకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం బియ్యం ధరలపైనా ప్రభావం చూపనుంది. బాస్మతి యేతర తెల్ల బియ్యాన్ని హెచ్ఎస్ కోడ్స్ ఆఫ్ పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించామని కేంద్రం తెలిపింది. దేశీయంగా ధరల కట్టడికి, ఆహార భద్రత కోసం జులై మూడో వారంలో బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం అమలు చేసింది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) టన్నుకు 1,200 డాలర్ల కంటే తక్కువ ఒప్పందాలను నమోదు చేయకూడదని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం టన్ను 1,200 డాలర్ల కంటే తక్కువ ఉన్న ఒప్పందాలు నిలిపివేయబడ్డాయి. బాస్మతీ బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమంగా ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే ఈ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు కోసం, APEDA అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచనలు చేసింది. బియ్యం రిటైల్ ధరలను నియంత్రించే ప్రయత్నంలో, దేశీయ సరఫరాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Read Also: Yevgeny Prigozhin: విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ మృతి.. జన్యు పరీక్ష ద్వారా నిర్ధారణ
గతేడాది సెప్టెంబరులో పగిలిన బియ్యం ఎగుమతిపై నిషేధం విధించగా, గత నెలలో బాస్మతీయేతర తెల్ల బియ్యంపై నిషేధం విధించింది. గత వారం బాస్మతియేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించారు. ఈ పరిమితులతో భారతదేశం ఇప్పుడు అన్ని రకాల బాస్మతీయేతర బియ్యాన్ని కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బాస్మతీయేతర బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేయడాన్ని నివారించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం APEDAకి ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లోకేషన్ సర్టిఫికేట్ (RCAC) జారీకి నమోదు చేయాలని ఏపీఈడీఏకి ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్రులను నిలిపేయవచ్చు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..