Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basmati Rice: దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం బాస్మతీ బియ్యం ముసుగులో తెలుపు బాస్మతీయేతర బియ్యం ‘అక్రమ’ ఎగుమతిని ఆపడానికి కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. టన్నుకు 1,200 డాలర్ల కంటే తక్కువ ఖరీదైన బాస్మతి బియ్యం ఎగుమతి అనుమతించకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం బియ్యం ధరలపైనా ప్రభావం చూపనుంది. బాస్మతి యేతర తెల్ల బియ్యాన్ని హెచ్ఎస్ కోడ్స్ ఆఫ్ పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించామని కేంద్రం తెలిపింది. దేశీయంగా ధరల కట్టడికి, ఆహార భద్రత కోసం జులై మూడో వారంలో బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం అమలు చేసింది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) టన్నుకు 1,200 డాలర్ల కంటే తక్కువ ఒప్పందాలను నమోదు చేయకూడదని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం టన్ను 1,200 డాలర్ల కంటే తక్కువ ఉన్న ఒప్పందాలు నిలిపివేయబడ్డాయి. బాస్మతీ బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమంగా ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే ఈ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు కోసం, APEDA అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచనలు చేసింది. బియ్యం రిటైల్ ధరలను నియంత్రించే ప్రయత్నంలో, దేశీయ సరఫరాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Read Also: Yevgeny Prigozhin: విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ మృతి.. జన్యు పరీక్ష ద్వారా నిర్ధారణ
గతేడాది సెప్టెంబరులో పగిలిన బియ్యం ఎగుమతిపై నిషేధం విధించగా, గత నెలలో బాస్మతీయేతర తెల్ల బియ్యంపై నిషేధం విధించింది. గత వారం బాస్మతియేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించారు. ఈ పరిమితులతో భారతదేశం ఇప్పుడు అన్ని రకాల బాస్మతీయేతర బియ్యాన్ని కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బాస్మతీయేతర బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేయడాన్ని నివారించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం APEDAకి ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లోకేషన్ సర్టిఫికేట్ (RCAC) జారీకి నమోదు చేయాలని ఏపీఈడీఏకి ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్రులను నిలిపేయవచ్చు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!