Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Central Minister Kishan Reddy Says That The Role Of Mines In The Countrys Economy Is Crucial

Kishan Reddy: దేశ ఆర్థిక వ్యవస్థలో గనుల పాత్ర కీలకం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Published Date :August 7, 2024 , 9:20 pm
By Kothuru Ram Kumar
  • ఉపాధి కల్పన & ఆర్థికాభివృద్ధిలో మైనింగ్ రంగం పాత్ర మరువలేనిది
  • దేశంలో ఉన్న ఖనిజవనరులను సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
  • మైనింగ్ రంగం అభివృద్ధికోసం.. అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం
  • సుస్థిరాభివృద్ధితో మైనింగ్ రంగంలో ముందుకెళ్తున్న సంస్థలకు 5 స్టార్ రేటింగ్స్ ప్రదానం.
  • - వచ్చే ఏడాది 7 ఉత్తమ సంస్థలకు 7స్టార్ రేటింగ్స్ కూడా..
Kishan Reddy: దేశ ఆర్థిక వ్యవస్థలో గనుల పాత్ర కీలకం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్ర గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది మైనింగ్ పరిశ్రమే అని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో.. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో, సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్రమంత్రి 5 స్టార్ అవార్డుల ప్రదానం చేశారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో.. తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మైనింగ్ సంస్థలున్నాయి.

VIVINT PHARMA: తెలంగాణాలో కొత్తగా ఇంజెక్టబుల్స్ తయారీ యూనిట్.. భారీగా ఉద్యోగాలు..

అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. అవార్డులు పొందిన వారందరినీ హృదయపూర్వకంగా అభినందించారు. మైనింగ్ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న వారందరినీ అభినందించడం కేంద్రప్రభుత్వం బాధ్యతన్నారు. ఈ అవార్డులు.. మైనింగ్ రంగం చేస్తున్న కృషిని ప్రోత్సహించడానికేనని.. ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ హైదరాబాద్ లో ఓ వర్క్ షాప్ నిర్వహించారని గుర్తుచేసిన కేంద్రమంత్రి.. ఆ కార్యక్రమంలో మైనింగ్ పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన సూచనల ఆధారంగా.. కొత్త నిబంధలను నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామన్నారు. మైనింగ్ రంగం, మంత్రిత్వ శాఖ సమన్వయంతో పనిచేస్తూ.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.

IND vs SL: స్పిన్ దెబ్బకు చేతులెత్తిసిన టీమిండియా.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక ..

భారతదేశంలో అపారమైన ఖనిజ సామర్థ్యం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి ఆలోచన ప్రకారం.. భారతదేశం ఈ రంగంలో స్వయంసమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. క్రిటికల్ మినరల్స్ ను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని, మన దేశంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే.. దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైనింగ్ లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ.. అభివృద్ధితోపాటుగా పర్యావరణాన్ని కాపాడేదిశగా పనిచేయాలని మైనింగ్ కంపెనీలకు కిషన్ రెడ్డి సూచించారు. గనుల భద్రత, కార్మికుల భద్రత, ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షణ.. వంటి అంశాల్లో సాంకేతికత వినియోగం చాలా అవసరమని ఆయన అన్నారు.

Illegal Constructions: లేవుట్ భూముల్లోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది..

ఇటీవల బడ్జెట్లో .. 25 క్రిటికల్ మినరల్స్ మీద కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తొలగించిందని, దీని ద్వారా దేశంలో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ మెరుగుపడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. ‘భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రానున్న రోజుల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా మారాలి. ఈ దిశగా మైనింగ్ రంగం తమ సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయాలి’ అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే జీ, గనుల శాఖ కార్యదర్శి శ్రీ వీఎల్ కాంతారావు, అదనపు కార్యదర్శి శ్రీ లోహియా, ఐబీఎం సెక్రటరీ జనరల్ శ్రీ పీఎన్ శర్మ,తోపాటు వివిధ రాష్ట్రాల గనుల శాఖ ఉన్నతాధికారులు, అవార్డు గ్రహీతలు, మైనింగ్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central minister
  • Economy
  • Kishan Reddy
  • mines
  • mines in the country

తాజావార్తలు

  • IPL 2026: ఐపీఎల్‌కు ముందు హ్యాండ్ ఇచ్చిన నలుగురు ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్లు..! షాక్‌లో టీమ్‌లు..

  • IPL 2026 Records: మెయిడెన్ ఓవర్ల మాయాజాలం.. ఐపీఎల్‌లో మొత్తం మనోళ్లదే హవా!

  • HYD Metro : మరోసారి మెట్రో ట్రైన్‌లో సాంకేతిక సమస్య.. రెండు వైపులా నిలిచిన మెట్రో రైళ్లు..

  • Indian Rupee: ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి.. తొలిసారిగా 93 మార్కును దాటిన డాలర్!

  • ManiRatnam : మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతికి జోడిగా సాయి పల్లవి

ట్రెండింగ్‌

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions