DA Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై తాజా అప్డేట్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DA Hike 2026: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త వేతన సవరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. 8వ వేతన సంఘం నిబంధనలు అధికారికంగా జనవరి 1, 2026 నుండి అమలులోకి రావాల్సి ఉంది. అయితే, కమిషన్ తన నివేదికను సిద్ధం చేయడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చు. అప్పటి వరకు ఉద్యోగులకు పాత (7వ) వేతన సంఘం ప్రకారమే జీతాలు అందుతాయి. ఒకసారి కొత్త ఫ్రేమ్వర్క్ ఖరారయ్యాక, బకాయిలతో కలిపి పెరిగిన జీతాలు అందుతాయని సమాచారం.
READ ALSO: Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
హోలీ కానుకగా 5% డీఏ (DA) పెంపు..
ద్రవ్యోల్బణాన్ని బట్టి పెంచే కరువు భత్యం (DA) ఈసారి 5 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ 58%, పెరిగిన తర్వాత డీఏ 63% కు చేరుకోవచ్చని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పెంపును మార్చిలో (హోలీ పండుగ సందర్భంగా) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పెంపు జనవరి 2026 నుంచి వర్తిస్తుంది కాబట్టి, ఏప్రిల్ జీతంలో బకాయిలతో కలిపి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కొత్త వేతన సంఘంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఫిబ్రవరి 25న ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇందులో కనీస వేతనం ఎంత ఉండాలి?, జీతభత్యాలు ఎంత పెంచాలి? అనే అంశాలపై ఒక ముసాయిదాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని సమాచారం. ఉద్యోగ సంఘాల డిమాండ్ల విషయానికి.. వేతన సంఘం తన రిపోర్టును 200 రోజుల్లోనే సమర్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్రపాలిత ప్రాంతాల వారికీ ఒకేసారి వేతన సవరణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారిక వెబ్సైట్ ప్రారంభం..
8వ వేతన సంఘం పనులను వేగవంతం చేసేందుకు, పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్తగా www.8cpc.gov.in అనే వెబ్సైట్ను ప్రారంభించింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సలహాలను, అభిప్రాయాలను నేరుగా ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.
READ ALSO: T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!