DA Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై తాజా అప్డేట్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DA Hike 2026: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త వేతన సవరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. 8వ వేతన సంఘం నిబంధనలు అధికారికంగా జనవరి 1, 2026 నుండి అమలులోకి రావాల్సి ఉంది. అయితే, కమిషన్ తన నివేదికను సిద్ధం చేయడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చు. అప్పటి వరకు ఉద్యోగులకు పాత (7వ) వేతన సంఘం ప్రకారమే జీతాలు అందుతాయి. ఒకసారి కొత్త ఫ్రేమ్వర్క్ ఖరారయ్యాక, బకాయిలతో కలిపి పెరిగిన జీతాలు అందుతాయని సమాచారం.
READ ALSO: Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
హోలీ కానుకగా 5% డీఏ (DA) పెంపు..
ద్రవ్యోల్బణాన్ని బట్టి పెంచే కరువు భత్యం (DA) ఈసారి 5 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ 58%, పెరిగిన తర్వాత డీఏ 63% కు చేరుకోవచ్చని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పెంపును మార్చిలో (హోలీ పండుగ సందర్భంగా) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పెంపు జనవరి 2026 నుంచి వర్తిస్తుంది కాబట్టి, ఏప్రిల్ జీతంలో బకాయిలతో కలిపి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కొత్త వేతన సంఘంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఫిబ్రవరి 25న ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇందులో కనీస వేతనం ఎంత ఉండాలి?, జీతభత్యాలు ఎంత పెంచాలి? అనే అంశాలపై ఒక ముసాయిదాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని సమాచారం. ఉద్యోగ సంఘాల డిమాండ్ల విషయానికి.. వేతన సంఘం తన రిపోర్టును 200 రోజుల్లోనే సమర్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్రపాలిత ప్రాంతాల వారికీ ఒకేసారి వేతన సవరణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారిక వెబ్సైట్ ప్రారంభం..
8వ వేతన సంఘం పనులను వేగవంతం చేసేందుకు, పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్తగా www.8cpc.gov.in అనే వెబ్సైట్ను ప్రారంభించింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సలహాలను, అభిప్రాయాలను నేరుగా ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.
READ ALSO: T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!