Education Minister: నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదంటే..?
- నీట్ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదు..
- పేపర్ లీక్ అనేది కొంతమంది విద్యార్థులను ప్రభావితం చేసింది..
- సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి: కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Education Minister: యూజీసీ- నెట్2024, నీట్ పేపర్ లీక్ వ్యవహారం రోజు రోజుకు తీవ్ర వివాదానికి దారి తీస్తుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో యూజీసీ నెట్ పరీక్షను కూడా ఎన్టీఏ రద్దు చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ను రద్దు చేయకూడదని ప్రభుత్వం ఎంచుకుందన్నారు. పేపర్ లీక్ అనేది పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందన్నారు. 2004, 2015లో విస్తృతమైన లీక్లు జరిగిన పరీక్షలను రద్దు చేయడానికి దారి తీసిన సంఘటనలకు భిన్నంగా ప్రస్తుతం ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పరీక్షను రద్దు చేయడం వల్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూస్తుందన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.. న్యాయస్థానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
Read Also: Samyuktha Menon : బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ కొట్టేసిన సంయుక్త.. లక్ అంటే ఇదే..
Also Read
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
- Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
- Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
అలాగే, కొంతమంది చేసిన ఈ తప్పుడు పని వల్ల కష్టపడి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కెరీర్ను తాకట్టు పెట్టడం అన్యాయం అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తాము బీహార్ పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం.. వారి దగ్గర నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తా.. వ్యవస్థలోని అవకతవకలను సరిదిద్దుతాము.. మాపై నమ్మకం ఉంచండని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం సహించదు అని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
Read Also: Samsung Galaxy S24 Ultra: నయా కలర్లో ‘గెలాక్సీ S24 అల్ట్రా’.. లుక్ అదిరిపోలా!
ఇక, మే 5వ తేదీన ఎన్టీఏ నిర్వహించిన NEET-UG 2024 పరీక్షలో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. అయితే, ప్రశ్నపత్రం లీక్ అయ్యిందనే వాదనలతో ఈ వివాదం తలెత్తింది. ఇందులో 1,500 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వివిధ కోర్టులలో దాఖలైన కేసులతో సహా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎన్టీఏ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించింది. కాగా, నీట్- యూజీసీ పరీక్షలో 67 మంది స్టూడెంట్స్ కు 720 మార్కులు రావడంతో క్వశ్చన్ పేపర్ లీకైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, అభ్యర్థులకు తప్పుడు ప్రశ్నలతో పాటు సమయం ఆలస్యం కావడం వల్ల కొంత మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని నేషనల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఎన్టీఏ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.
తాజావార్తలు
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!