Syria: సిరియాలో మారణహోమం!.. అక్కడి నుంచి వచ్చేయాలని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
- సిరియాలో అధికారం కోసం మళ్లీ హింస
- హమా నగరాన్ని ఆక్రమించిన తిరుగుబాటుదళాలు
- భారతీయులు కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామిక్ దేశం సిరియాలో అధికారం కోసం మళ్లీ హింస చెలరేగింది. ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) గత వారం అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, సైన్యంపై దాడి చేసింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హెచ్టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగుతున్నాయి. దీని తరువాత.. సిరియాలో ఉద్రిక్తత పెరిగింది. హిట్ఎస్ దాడి కారణంగా.. ప్రభుత్వ సైన్యం కూడా వెనక్కి తగ్గింది. ఈ దాడి తర్వాత దాదాపు 14 ఏళ్లుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధ పరిస్థితులు తారుమారయ్యాయి.
READ MORE: CM Revanth Reddy: నేడు నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ఇస్లామిక్ దేశంలో హింస చెలరేగిన తర్వాత.. భారత ప్రభుత్వం భారతీయ పౌరులకు ప్రయాణ సలహా జారీ చేసింది.
సిరియాలో హింస, అశాంతి దృష్ట్యా ప్రయాణాలకు దూరంగా ఉండాలని పౌరులందరినీ కోరుతూ భారత ప్రభుత్వం శుక్రవారం ఒక సలహా జారీ చేసింది. సిరియాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. తదుపరి ప్రకటన వచ్చే వరకు భారతీయులు సిరియాకు వెళ్లకూడదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సూచించింది.
READ MORE:CM Chandrababu : నేడు బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటన…
సిరియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఒంటరిగా ఉన్న భారతీయులను వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా అక్కడి నుంచి బయలుదేరాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఇది కాకుండా.. భారతీయ పౌరుల కోసం అత్యవసర హెల్ప్లైన్ నంబర్, ఇమెయిల్ ఐడి జారీ చేసింది. ఏమైనా సమస్యలు ఏర్పడితే.. డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది.
READ MORE:BJP Poru Sabha: నేడు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా
“సిరియాలో ఉన్న భారతీయులకు ఏమైనా సాయం కావాలంటే.. డమాస్కస్లోని ఇండియన్ ఎంబసీ యొక్క ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్ను +963 993385973ను సంప్రదించండి. వాట్సప్లో కూడా సంప్రదించవచ్చు. లేదా ఇమెయిల్ ఐడి hoc.damascus@mea.gov.inలో సంప్రదించవలసిందిగా ఎమ్ఈఏ అభ్యర్థించింది. ఈ పరిస్థితిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. “ఉత్తర సిరియాలో ఇటీవల పెరిగిన ఉద్రిక్తతలను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. సిరియాలో దాదాపు 90 మంది భారతీయ పౌరులు ఉన్నారు. వీరిలో 14 మంది వివిధ యూఎన్ సంస్థల్లో పనిచేస్తున్నారు. మేము వారితో టచ్లో ఉన్నాం” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!