Pakistan : పాకిస్థాన్లో ఖురాన్ పేజీలను తగులబెట్టిన మహిళలు.. ఇద్దరిపై దైవదూషణ కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో మంగళవారం ఖురాన్ పేజీలను తగులబెట్టినందుకు ఇద్దరు ముస్లిం మహిళలపై దైవదూషణ కేసు నమోదైంది. కసూర్ జిల్లా రాయ్ కలాన్ గ్రామంలో స్థానిక ఇమామ్ కాషిఫ్ అలీ ఫిర్యాదు చేశారు. సెక్షన్ 295-బి కింద ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ షహనాజ్ ఖాన్, ఆమె కుక్ షాజియా కరామత్పై కేసు నమోదు చేశారు. మసీదు నుంచి కాషిఫ్ అలీ ఈ విషయాన్ని ప్రకటించారని పాక్ పోలీసు అధికారి ఖలీద్ సలీం తెలిపారు. దీని తర్వాత, ఆ మహిళలు శనివారం ఖురాన్ పేజీలను తగులబెట్టారు. ఈ ఘటన తర్వాత మహిళలు, వారి కుటుంబ సభ్యులు గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఎలాంటి పెద్ద సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన గుంపు ఇల్లు, పాఠశాలకు చేరుకోవడానికి ముందు షెహనాజ్ ఖాన్ ఎక్కడో దాక్కున్నారని వారు తెలిపారు.
Read Also:CM Revanth Reddy : గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
- GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
గత వారం, పంజాబ్ పోలీసులు ఇద్దరు యువ క్రైస్తవ సోదరీమణులపై దైవదూషణ ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సమియా మసిహ్.. సోనియా మాసిహ్ ఇద్దరి వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. ఇదిలావుండగా, ఈ క్రైస్తవ సోదరీమణులపై వచ్చిన అగౌరవ ఆరోపణలు అవాస్తవమని మైనారిటీ అలయన్స్ పాకిస్థాన్ అధ్యక్షుడు అడ్వకేట్ అక్మల్ భట్టి అన్నారు. గతేడాది కూడా పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని జరన్వాలాలో 21 చర్చిలకు రాడికల్స్ నిప్పుపెట్టారు. గతేడాది ఆగస్టులో జరిగిన ఈ ఘటన తర్వాత క్రైస్తవుల ఇళ్లను లూటీ చేసి తగులబెట్టారు. ఈ చర్చిలు దైవదూషణను ప్రోత్సహిస్తున్నాయని చాలా ఫండమెంటలిస్ట్ గ్రూపులు ఆరోపించాయి. ఈ కేసులో 150 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో 6500 మంది పోలీసులను మోహరించారు. జరన్వాలాలో హింసాకాండ సందర్భంగా పోలీసులు అక్కడే ఉన్నారు. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అల్లర్ల కారణంగా, ప్రపంచంలోని అనేక దేశాలు పాకిస్తాన్లోని మైనారిటీల భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తాయి.
Read Also:UP: 13 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన యువకుడికి ఊరట.. జీవిత ఖైదు రద్దు
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!