Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే
- డిసెంబర్లో కార్లపై భారీగా ఆఫర్లు
- 2025లో కార్ల ధరలు పెరుగుతాయి
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Price Hike Alert: 2024 ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. దింతో ప్రస్తుతం వివిధ ఆటో దిగ్గజ కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, సంవత్సరం మారుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఆటో దిగ్గజ సంస్థలు వారి వాహనాల ధరలను అమాంతం పెంచేందుకు రెడీ అయిపోయాయి. ప్రస్తుతం డిసెంబర్ నెల కాబట్టి వివిధ కంపెనీలు భారీ ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మరి ఏఏ కంపెనీలు వారి వాహన ధరలను ఏమాత్రం పెంచబోతున్నాయో ఒక లుక్ వేద్దాం..
Also Read: Toyota Camry: స్టైలిష్ లుక్, అబ్బురపరిచే ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన టయోటా క్యామ్రీ
Also Read
- 1983 Cricket World Cup: "తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం".. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
- Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
ఇందులో మొదటగా టాటా మోటార్స్ కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే, టాటా మోటార్స్ తన వాహనాల ధరలను జనవరి 2025 నుండి అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 వరకు మాత్రమే మీరు ప్రస్తుత ధరకే కార్లను కొనుగోలు చేయగలుగుతారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల వాహనాలపై ఈ ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. నిరంతరం పెరుగుతున్న ఖర్చులు, ఖరీదైన లాజిస్టిక్స్ ఇంకా ద్రవ్యోల్బణం పరిస్థుతుల కారణంగా వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అన్ని వాహనాల ఎక్స్-షోరూమ్ ధరను దాదాపు 3 శాతం పెంచనున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలియచేసింది. అయితే, ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనేది మాత్రం కంపెనీ పూర్తిగా వెల్లడించలేదు. ఇది వివిధ మోడల్స్, వేరియంట్లపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
టాటా మోటార్స్తో పాటు, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, ఎమ్జి మోటార్స్, మహీంద్రా కూడా జనవరి నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకీ తన కార్ల ధరలను 4% పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ కార్ల ధరలను రూ.25,000 మేర పెంచనున్నట్లు సమాచారం. అలాగే, MG మోటార్ తన కార్ల ధరలను 3% మేర పెంచుతుందని తెలుస్తోంది. కియా ఇండియా 2% పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇక మరోవైపు, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకెళ్తుంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో టియాగో EV, టిగోర్ EV, Nexon EV, పంచ్ EV, కర్వ్ EV వంటి అనేక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ అన్ని కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. గత నెలలో టాటా మోటార్స్ కార్ల అమ్మకాలలో 2 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో కంపెనీ 47 వేలకు పైగా యూనిట్లను అమ్మింది.
తాజావార్తలు
-
1983 Cricket World Cup: “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం”.. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
-
Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
-
Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
-
Peddi VS Devara : ‘దేవర’ని అందుకోలేకపోయిన ‘పెద్ది’.. ఛాన్స్ మిస్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!