Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే
- డిసెంబర్లో కార్లపై భారీగా ఆఫర్లు
- 2025లో కార్ల ధరలు పెరుగుతాయి
- పూర్తి వివరాలు ఇలా..
Car Price Hike Alert: 2024 ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. దింతో ప్రస్తుతం వివిధ ఆటో దిగ్గజ కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, సంవత్సరం మారుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఆటో దిగ్గజ సంస్థలు వారి వాహనాల ధరలను అమాంతం పెంచేందుకు రెడీ అయిపోయాయి. ప్రస్తుతం డిసెంబర్ నెల కాబట్టి వివిధ కంపెనీలు భారీ ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మరి ఏఏ కంపెనీలు వారి వాహన ధరలను ఏమాత్రం పెంచబోతున్నాయో ఒక లుక్ వేద్దాం..
Also Read: Toyota Camry: స్టైలిష్ లుక్, అబ్బురపరిచే ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన టయోటా క్యామ్రీ
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
ఇందులో మొదటగా టాటా మోటార్స్ కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే, టాటా మోటార్స్ తన వాహనాల ధరలను జనవరి 2025 నుండి అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 వరకు మాత్రమే మీరు ప్రస్తుత ధరకే కార్లను కొనుగోలు చేయగలుగుతారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల వాహనాలపై ఈ ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. నిరంతరం పెరుగుతున్న ఖర్చులు, ఖరీదైన లాజిస్టిక్స్ ఇంకా ద్రవ్యోల్బణం పరిస్థుతుల కారణంగా వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అన్ని వాహనాల ఎక్స్-షోరూమ్ ధరను దాదాపు 3 శాతం పెంచనున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలియచేసింది. అయితే, ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనేది మాత్రం కంపెనీ పూర్తిగా వెల్లడించలేదు. ఇది వివిధ మోడల్స్, వేరియంట్లపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
టాటా మోటార్స్తో పాటు, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, ఎమ్జి మోటార్స్, మహీంద్రా కూడా జనవరి నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకీ తన కార్ల ధరలను 4% పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ కార్ల ధరలను రూ.25,000 మేర పెంచనున్నట్లు సమాచారం. అలాగే, MG మోటార్ తన కార్ల ధరలను 3% మేర పెంచుతుందని తెలుస్తోంది. కియా ఇండియా 2% పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇక మరోవైపు, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకెళ్తుంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో టియాగో EV, టిగోర్ EV, Nexon EV, పంచ్ EV, కర్వ్ EV వంటి అనేక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ అన్ని కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. గత నెలలో టాటా మోటార్స్ కార్ల అమ్మకాలలో 2 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో కంపెనీ 47 వేలకు పైగా యూనిట్లను అమ్మింది.
తాజావార్తలు
-
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
-
West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
-
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!