NTV Telugu Site icon

Car Fire Accident: ఫార్చ్యూనర్‌ కారులో భారీ అగ్నిప్రమాదం.. యువకుడు సజీవదహనం

Car

Car

Car Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఫార్చ్యూనర్‌ కారులో అగ్నిప్రమాదం సంభవించి ఓ యువకుడు సజీవదహనమయ్యాడు. రోడ్డుకు 100 మీటర్ల దూరంలో కారు కనిపించడంతో కారుకు నిప్పంటించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి స్నేహితులే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ పుల్ నాగ్లా సమీపంలో ఫార్చ్యూనర్ కారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో కారులో కూర్చున్న యువకుడు కాలి బూడిదయ్యాడు. వాహనంలోంచి మంటలు రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఫార్చ్యూనర్‌లో ఉన్న యువకుడిని బయటకు తీయడానికి ప్రయత్నించినా బయటకు తీయలేక పోవడంతో సజీవదహనం అయ్యి చనిపోయాడు.

Read Also: Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు..

ఇకపోతే చనిపోయిన ఆ యువకుడిని సంజయ్ యాదవ్‌గా గుర్తించారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అతను ఘజియాబాద్‌లోని నెహ్రూ నగర్‌లో నివాసం ఉండేవాడు. ఫార్చ్యూనర్‌ను రోడ్డుకు 100 మీటర్ల దూరంలో నిలిపి ఉండడంతో సంజయ్‌ హత్యకు గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆభరణాల విషయంలో సంజయ్‌ యాదవ్‌ తన స్నేహితులతో గొడవ పడుతున్నాడని, అందుకే సంజయ్‌ను సజీవ దహనం చేసి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేర్లు వెల్లడించిన తర్వాత ఏ కేసు విషయంలో మరింత మందిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: WhatsApp New Feature: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్‌!