Group-2 Exam: కొంప ముంచిన నిమిషం నిబంధన.. పరీక్షకు దూరమైన అభ్యర్థులు
- గ్రూప్-2 విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధనం కొంపముంచింది..
- నిమిషం నిబంధనతో కొందరు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు..
Group 2 Exam: గ్రూప్-2 విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధనం కొంపముంచింది. నిమిషం నిబంధనతో కొందరు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. తెలంగాణలో ఇవాళ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు మొదటి పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అయితే కొందరు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో కొందరు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు.
Read also: Taapsee Pannu: పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన తాప్సీ..
జిల్లాల వారీగా పరీక్షకు దూరమైన అభ్యర్థులు..
* ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆలస్యంగా రావడంతో 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. ఉదయం 9.30 గంటలకే గేట్ క్లోజ్ చేశారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించడంకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. అనుమతి నిరాకరించడంతో పలువురు కంటతడి పెట్టుకున్నారు.
* కొమురం భీం జిల్లాలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీటీజి గర్ల్స్ హాస్టల్ లో గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థినీ నిమిషం ఆలస్యం రావడంతో అనుమతించని సిబ్బంది. దీంతో ముగ్గురు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు.
* మంచిర్యాల జిల్లాలో శ్రీ హర్ష డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు ముగ్గురు అభ్యర్థులను లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించిన అధికారులు.
Read also: Save The Girl Child: సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి: హోంమంత్రి అనిత
* జనగామ జిల్లాలో ఓ బాలింత మహిళ అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్న గ్రూప్ 2 పరీక్ష వ్రాసే అవకాశాన్ని కోల్పోయింది. ఓఎంఆర్ షీటు బయోమెట్రిక్ సమయంలో అభ్యర్థి సెంటర్ మారిందని గుర్తించిన అధికారులు. అప్పటికే అరగంట పాటు అదే సెంటర్ లోనే కూర్చోవడంతో వృధా అయిన సమయం. పరీక్ష కేంద్రంలోకి అనుమతించి నప్పుడు సెంటర్ కోడు చూసి ఇది కాదు అని చెప్పిన అధికారులు. దీంతో వెంటనే పక్కనే ఉన్న అసలు పరీక్ష కేంద్రానికి వెళ్లిన అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక పరీక్షా కేంద్రం వద్ద కన్నీరు పెట్టుకుంటూ తన ఆవేదన వ్యక్తం చేసిన బాలింత మహిళ.
* జనగామ జిల్లా లోని క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఐదుగురు గ్రూప్ 2 అభ్యర్థులు. నిబంధన మేరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించని అధికారులు. నిరాశతో వెనుతిరిగి వెళ్లిన అభ్యర్థులు.
* వరంగల్ ఏస్ అర్ కాలేజి సెంటర్ లో గ్రూప్ 2 పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ -2 పరీక్షా కేంద్రానికి 05 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన రాంబాబు అనే అభ్యర్థిని లోనికి అనుమతించని నిర్వాహకులు.
* నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా హాజరైన 19 మంది అభ్యర్థులను అనుమతించని అధికారులు.
* ములుగు జిల్లా గ్రూప్ 2 పరీక్షకు సాధన స్కూల్ వద్దకి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన భవాని అనే అభ్యర్థిని కాగా, మరొకరు కన్నాయిగూడెం మండలానికి చెందిన అభ్యర్థి. వివరాలు చెప్పకుండా వెంటనే అక్కడ నుంచి వెళ్లిన అభ్యర్థులు.
* సంగారెడ్డి లోని గ్రూప్ 2 పరీక్ష కేంద్రానికి 15 మంది అభ్యర్థులు వచ్చారు. లోపలికి అనుమతించని అధికారులు.
Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్.. ఇటీవల పరిణామాలపై చర్చ..
తాజావార్తలు
-
Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!
-
RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
-
Sudan Gurung: కొత్త ప్రభుత్వంలో అప్పుడే రాజీనామా! ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే వైదొలిగిన హోం మంత్రి..
-
Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
-
MS Dhoni: ధోనీకి “లెఫ్టినెంట్ కల్నల్” హోదా ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే.. రిటైర్డ్ లెఫ్టినెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!