Justin Trudeau: కెనడా భారత్తో పరిస్థితిని పెంచుకోవాలని చూడటం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: కెనడా భారత్తో పరిస్థితిని పెంచడానికి చూడటం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. కెనడా భారత్తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణానికి, భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని ఆరోపించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతూ వచ్చింది. అయితే, భారతదేశం ఈ వాదనలను పూర్తిగా తిరస్కరించింది, వాటిని అసంబద్ధంగా పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతో కెనడా ఈ ఆరోపణలు చేసినట్లు ఖండించింది. అక్టోబరు 10 నాటికి దాదాపు 40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరిందని ఫైనాన్షియల్ టైమ్స్లో ఒక నివేదిక తెలిపిన రోజున పరిస్థితిని మరింత తీవ్రతరం చేయకూడదని కెనడా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్య చేశారు.
Also Read: China: గూఢచారి నౌకలతో భారత్ సముద్ర ప్రాంతాన్ని చైనా ఎందుకు స్కాన్ చేస్తోంది?
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఇదిలా ఉండగా.. భారత్- కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కఠినమైన వైఖరిని తీసుకున్న భారత్.. కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని కోరింది. అక్టోబర్ 10లోగా 41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేయాలని కెనడాను భారత్ కోరినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అక్టోబర్ 10 తర్వాత దేశం విడిచి వెళ్లాల్సిందిగా కోరిన అనంతరం కెనడా దౌత్యవేత్తల అధికారాలను రద్దు చేస్తామని భారత్ బెదిరించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఇండియాలో కెనడాకు చెందిన 62 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. మొత్తం కెనడా దౌత్యవేత్తల సంఖ్యను 41కి తగ్గించాలని భారత్ పేర్కొంది. అయితే ఈ విషయంపై భారత్, కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఇంకా స్పందించలేదు. కెనడా మొదట భారతీయ దౌత్యవేత్తలపై హింస, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించిందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కెనడాలో సిక్కు వేర్పాటువాద గ్రూపుల ఉనికి భారత్ను నిరాశపరిచిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!