2022-2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్ధిక గణాంకాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. రాబడులు- వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నివేదిక ఇచ్చింది.
కాగ్ నివేదిక..
పథకాల అమలు కోసం కేంద్రం బదలాయించిన రూ 15,771 కోట్ల రూపాయలు వార్షిక ఖాతాల్లో ప్రతిఫలించ లేదు.
2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.48,728 కోట్ల రుణాలు తీసుకోవాలని అంచనా వేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.52,508 కోట్ల రుణం తీసుకుంది.
అసెంబ్లీ ఆమోదించిన మొత్తం కంటే అదనంగా రూ. 4,027 కోట్లను ఖర్చు చేసేశారు.
2022-23 ఆర్ధిక సంవత్సరంలో 341 రోజుల పాటు వేస్అండ్ మీన్స్ అడ్వాన్సులను ఏపీ వినియోగించుకుంది.
రిజర్వు బ్యాంకు ఖాతాలో రూ.1.94 కోట్ల కంటే తక్కువ నిల్వల కారణంగా ఏడాదిలో 1,18,039 కోట్లను వేస్ అండ్ మీన్స్ గా వాడుకుంది.
ఇదే ఆర్ధిక సంవత్సరంలో 152 రోజుల పాటు ఏపీ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకుంది.
మొత్తం రూ. 57,066 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ ఏపీ వాడుకుంది.
2022-23 ఆర్ధిక సంవత్సరంలో 73 మార్లు బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 57,478 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఏడాదిలో రూ. 8,411 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చింది.
మూలధన వ్యయం కేవలం రూ.7244 కోట్లకు మాత్రమే పరిమితం.
రాష్ట్రస్థూల ఉత్పత్తిలో మూలధన వ్యయం కేవలం 0.55 శాతం మాత్రమే.
వివిధ కార్పోరేషన్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వ హామీలు రూ.1,38,875 కోట్లు.