Cabinet Meeting : కేబినెట్ మీటింగ్ షురూ.. రక్షణ రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Meeting : జూలై 23న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. రానున్న బడ్జెట్కు సంబంధించి కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని మోడీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో జరగనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలి కేబినెట్ సమావేశం ఇదే. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది.
Read Also:Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత సెషన్లో మాదిరిగా వచ్చే సెషన్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు అగ్నివీర్, కశ్మీర్లో షెల్లింగ్తో పాటు మరెన్నో అంశాలు నేటి కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. యూపీలో రాజకీయ గందరగోళం నెలకొంది. అధికార బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన ప్రకటన నుండి యుపిలో రాజకీయ వేడి పెరిగింది.
Read Also:Telangana High Court: తెలంగాణలో వీధి కుక్కల దాడులు.. హైకోర్టు సీరియస్..
కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వ కంపెనీలు తమ బొగ్గు గనుల దగ్గర భూమిని లీజు హక్కును పొందవచ్చు. రక్షణ రంగానికి సంబంధించిన 4 ప్రతిపాదనలను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించవచ్చు. కేంద్ర బడ్జెట్ 2024పై సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా కలవనున్నారు. బడ్జెట్ సెషన్ జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తుంది. దీంతో పాటు ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రధాని సందర్శించవచ్చు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!