Cabinet Meeting : కేబినెట్ మీటింగ్ షురూ.. రక్షణ రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Meeting : జూలై 23న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. రానున్న బడ్జెట్కు సంబంధించి కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని మోడీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో జరగనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలి కేబినెట్ సమావేశం ఇదే. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది.
Read Also:Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత సెషన్లో మాదిరిగా వచ్చే సెషన్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు అగ్నివీర్, కశ్మీర్లో షెల్లింగ్తో పాటు మరెన్నో అంశాలు నేటి కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. యూపీలో రాజకీయ గందరగోళం నెలకొంది. అధికార బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన ప్రకటన నుండి యుపిలో రాజకీయ వేడి పెరిగింది.
Read Also:Telangana High Court: తెలంగాణలో వీధి కుక్కల దాడులు.. హైకోర్టు సీరియస్..
కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వ కంపెనీలు తమ బొగ్గు గనుల దగ్గర భూమిని లీజు హక్కును పొందవచ్చు. రక్షణ రంగానికి సంబంధించిన 4 ప్రతిపాదనలను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించవచ్చు. కేంద్ర బడ్జెట్ 2024పై సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా కలవనున్నారు. బడ్జెట్ సెషన్ జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తుంది. దీంతో పాటు ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రధాని సందర్శించవచ్చు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!