Cabinet Meeting : కేబినెట్ మీటింగ్ షురూ.. రక్షణ రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం
Cabinet Meeting : జూలై 23న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. రానున్న బడ్జెట్కు సంబంధించి కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని మోడీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో జరగనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలి కేబినెట్ సమావేశం ఇదే. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది.
Read Also:Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత సెషన్లో మాదిరిగా వచ్చే సెషన్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు అగ్నివీర్, కశ్మీర్లో షెల్లింగ్తో పాటు మరెన్నో అంశాలు నేటి కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. యూపీలో రాజకీయ గందరగోళం నెలకొంది. అధికార బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన ప్రకటన నుండి యుపిలో రాజకీయ వేడి పెరిగింది.
Read Also:Telangana High Court: తెలంగాణలో వీధి కుక్కల దాడులు.. హైకోర్టు సీరియస్..
కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వ కంపెనీలు తమ బొగ్గు గనుల దగ్గర భూమిని లీజు హక్కును పొందవచ్చు. రక్షణ రంగానికి సంబంధించిన 4 ప్రతిపాదనలను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించవచ్చు. కేంద్ర బడ్జెట్ 2024పై సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా కలవనున్నారు. బడ్జెట్ సెషన్ జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తుంది. దీంతో పాటు ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రధాని సందర్శించవచ్చు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో