UPI Payments: రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Payments: డిజిటల్ ఇండియా కలను సాకారం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెచ్చిన డిజిటల్ చెల్లింపుల పర్యావరణాన్ని మరింత ప్రోత్సహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు మూడు కొత్త కో-ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సమావేశం అనంతరం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.
చిన్న మొత్తంలో డిజిటల్ లావాదేవీలకు రూ.2,600 కోట్ల ప్రోత్సాహక మొత్తాన్ని మోడీ కేబినెట్ ఆమోదించింది. భీమ్-యూపీఐ నుంచి జరిపే లావాదేవీలపై ప్రోత్సాహకం అందుబాటులో ఉంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందు గతంలో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి నిర్ణయాలు ఉండబోవని కేంద్రం తాజా నిర్ణయం ద్వారా చెప్పకనే చెప్పింది. దీనితో పాటు మూడు బహుళస్థాయి సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దేశీయంగా రూపే డెబిట్ కార్డులతోపాటు, తక్కువ విలువ కలిగిన భీమ్-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.2,600 కోట్లు కేటాయించింది. రూపే, యూపీఐ ద్వారా పాయింట్ ఆఫ్ సేల్, ఇ-కామర్స్ వేదికలపై చేసే లావాదేవీలను ప్రోత్సహిస్తే బ్యాంకులకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడనుంది. యూపీఐ లైట్, యూపీఐ123పేను సైతం ప్రోత్సహించాలన్ని ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Passports: అత్యంత బలహీనమైన పాస్పోర్టు పాకిస్థాన్దే.. మరి భారత్ సంగతేంటి?
దేశంలో సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలు, ఎగుమతులను ప్రోత్సహించేందుకుగాను మూడు కో-ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వీటితో పాటు దేశంలో అమలవుతున్న ప్రధాన మంత్రి ఉచిత ఫుడ్ స్కీమ్ పేరును మార్చాలని మోదీ కేబినెట్ నిర్ణయించింది. ఇకపై కార్యక్రమానికి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని నామకరణం చేయాలని నిర్ణయించారు. గత కేబినెట్లో ఉచిత ఆహార పథకాన్ని ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!