UPI Payments: రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక నిర్ణయం
UPI Payments: డిజిటల్ ఇండియా కలను సాకారం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెచ్చిన డిజిటల్ చెల్లింపుల పర్యావరణాన్ని మరింత ప్రోత్సహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు మూడు కొత్త కో-ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సమావేశం అనంతరం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.
చిన్న మొత్తంలో డిజిటల్ లావాదేవీలకు రూ.2,600 కోట్ల ప్రోత్సాహక మొత్తాన్ని మోడీ కేబినెట్ ఆమోదించింది. భీమ్-యూపీఐ నుంచి జరిపే లావాదేవీలపై ప్రోత్సాహకం అందుబాటులో ఉంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందు గతంలో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి నిర్ణయాలు ఉండబోవని కేంద్రం తాజా నిర్ణయం ద్వారా చెప్పకనే చెప్పింది. దీనితో పాటు మూడు బహుళస్థాయి సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దేశీయంగా రూపే డెబిట్ కార్డులతోపాటు, తక్కువ విలువ కలిగిన భీమ్-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.2,600 కోట్లు కేటాయించింది. రూపే, యూపీఐ ద్వారా పాయింట్ ఆఫ్ సేల్, ఇ-కామర్స్ వేదికలపై చేసే లావాదేవీలను ప్రోత్సహిస్తే బ్యాంకులకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడనుంది. యూపీఐ లైట్, యూపీఐ123పేను సైతం ప్రోత్సహించాలన్ని ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
Passports: అత్యంత బలహీనమైన పాస్పోర్టు పాకిస్థాన్దే.. మరి భారత్ సంగతేంటి?
దేశంలో సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలు, ఎగుమతులను ప్రోత్సహించేందుకుగాను మూడు కో-ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వీటితో పాటు దేశంలో అమలవుతున్న ప్రధాన మంత్రి ఉచిత ఫుడ్ స్కీమ్ పేరును మార్చాలని మోదీ కేబినెట్ నిర్ణయించింది. ఇకపై కార్యక్రమానికి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని నామకరణం చేయాలని నిర్ణయించారు. గత కేబినెట్లో ఉచిత ఆహార పథకాన్ని ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!