హిమాచల్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జాతీయ రహదారి-5పై ఉన్న సిమ్లా-కల్కా రోడ్డును గత కొద్దిరోజులుగా మూసి ఉంది. అయితే ఆ రహదారిని గురువారమే తేలికపాటి వాహనాలకు అనుమతులు ఇచ్చారు. అయితే ఆ రోడ్డులో బస్సు రావడంతో ఒక్కసారిగా రోడ్డు కుంగి ప్రమాదం జరిగింది. సిమ్లాకు వెళ్లే దారిలో మండి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
AP Employees: మాకు కనీస సౌకర్యాలు కల్పించండి..
మరోవైపు భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలో దాదాపు 200 రోడ్డు మార్గాలను మూసివేశారు. అంతేకాకుండా.. సుమారు 200 మార్గాల్లో ఎలక్ట్రిసిటీని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో తేలికపాటి వాహనాలను అనుమతించారు. దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.