Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: రాజస్థాన్లోని బుండి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈకో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, అక్కడి నుంచి కోటాకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి సికార్లో ఖతు శ్యామ్ దర్శనానికి వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులందరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read Also:UP T20 League 2024: రెండో సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రింకు సింగ్ జట్టు..
Also Read
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
- Fake Registration: ఏం తెలివిరా నాయనా.. భూమిని ఆక్రమించడానికి తహసీల్దార్, వీఆర్ఓ సంతకాల ఫోర్జరీ..
ఈ ప్రమాదం బుండిలోని హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చెరువు పక్కనే ఉన్న ఓవర్బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఉదయం లారీ, ఈకో కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎకో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వెనుక కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎస్పీ బుండి, సీఓ హిందోలి పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also:Ganesh Immersion: అటు బాలాపూర్.. ఇటు ఖైరతాబాద్.. రూట్మ్యాప్ విడుదల చేసిన సీపీ ఆనంద్..
గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స చేసి కోట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వారి కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయం అందడంలో జాప్యం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బండి ఎస్పీ హనుమాన్ ప్రసాద్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రక్కు లేదా ఈకో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
-
Peddi: సెకండ్ వీకెండ్లోనూ తగ్గని జోరు.. బుక్మైషోలో రికార్డుల వేట!
-
US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
-
West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
-
SpaceX IPO: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా భారత టెక్కీలు! మస్క్ ‘స్పేస్ఎక్స్’ తెస్తున్న లక్ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!