BSE Market Capitalisation : ఏడాదిలో రూ.126లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSE Market Capitalisation : భారత స్టాక్ మార్కెట్కు సోమవారం చారిత్రాత్మకమైన రోజు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, నిఫ్టీ మళ్లీ జీవితకాల గరిష్టాన్ని తాకడంలో విజయవంతమైంది. రెండవది, స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ విలువ కూడా నేటి సెషన్లో రికార్డు స్థాయికి చేరుకుంది. బీఎస్సీలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ 19 ఫిబ్రవరి 2024న రూ.391.69 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అయితే ఒక్క ఏడాదిలోనే భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.126 లక్షల కోట్లు పెరిగిందని తెలిస్తే షాక్ అవుతారు.
మార్కెట్ విలువలో 47శాతం జంప్!
నేటి సెషన్లో బిఎస్ఇలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.391.69 లక్షల కోట్ల వద్ద ముగిసింది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం 20 ఫిబ్రవరి 2023న బీఎస్సీలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.265.91 లక్షల కోట్లు. అంటే.. కేవలం ఒక్క ఏడాదిలోనే బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల వాల్యుయేషన్లో రూ.126 లక్షల కోట్ల మేర పెరిగి, ఇందులో ప్రభుత్వ కంపెనీల షేర్లు పెద్దఎత్తున సహకారం అందించాయి. అంటే ఒక్క ఏడాదిలో మార్కెట్ వాల్యుయేషన్ 47 శాతానికి పైగా పెరిగింది.
Also Read
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
- Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
- CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
Read Also:Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే ధనధాన్య సమృద్ధి కలుగుతుంది
24 శాతం పెరిగిన నిఫ్టీ
మార్కెట్ విలువ పెరగడమే కాకుండా.. ఈ కాలంలో బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా బలమైన పెరుగుదలను కనబరిచాయి. ఫిబ్రవరి 20, 2023న, సెన్సెక్స్ 60,710 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఇప్పుడు 72,708 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే ఏడాది వ్యవధిలో సెన్సెక్స్ 12,000 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ ఏడాది క్రితం 17,844 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఇప్పుడు 22,122 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే ఒక్క ఏడాదిలో నిఫ్టీలో 4278 పాయింట్ల జంప్ నమోదైంది. అంటే గత ఏడాది కాలంలో నిఫ్టీ 24 శాతం పెరిగింది.
400 లక్షల కోట్ల లక్ష్యం ఎంతో దూరంలో లేదు!
నేటి ట్రేడింగ్లో బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ గరిష్టంగా రూ.392 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక మార్కెట్లో ఎలాంటి బూమ్ కనిపిస్తోంది, రూ.400 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ లక్ష్యం ఎంతో దూరంలో లేదు.
Read Also:YSR Kalyanamasthu: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల
తాజావార్తలు
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!